AP CRIME: బందరులో ఘోరం.. గర్భిణి ప్రాణం తీసిన ఆస్పత్రి.. అసలేమైందంటే..?

మచిలీపట్నంలో వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నోబుల్‌ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27)గా గుర్తింపు.

New Update
injection

injection

AP Crime: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది.  వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని  నోబుల్‌ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటోంది. ఎప్పటి మాదిరి మంగళవారం ఉదయం వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పలు పరీక్షలు చేయాలని డాక్టర్లు తెలిపారు. 

ఇంజక్షన్ వికటించి..

దీని కోసం రూ.700 కట్టించుకుని మధ్యాహ్నం సమయంలో మల్లేశ్వరి ఇంజక్షన్‌ చేశారు. అయితే.. కొంతసేపటికి ఆమె ఆస్వస్థతకు గురయింది.  వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఐసీయూలో చికిత్స అందించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మల్లేశ్వరి మృతి చెందినట్లు  డాక్టర్లు తెలిపారు.  దీంతో బంధువులు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆందోళన చెందారు.  డాక్టర్ల నిర్లక్ష్యంతో మల్లేశ్వరి చనిపోయిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మల్లేశ్వరి మృతితో ఆందోళన వ్యక్తం చేసిన బంధువులు వైద్యురాలి ఐసీయూ గదిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాక్టర్‌ చేసిన ఇంజక్షన్‌ వికటించి ఆమె చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రాగి పిండి ఫేస్‌ ప్యాక్‌తో ముఖం అద్దంలా మెరిసిపోతుంది

నిండుగర్భిణి చనిపోయిందని బాధతో ఉన్న బంధువులను సెటిల్‌మెంట్‌ చేసుకుందామని రావాలంటూ మల్లెశ్వరి భర్త, డాక్టర్లతోతోపాటు మరికొందరు చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గర్భిణి మృతికి కారణమైన ఆస్పత్రిని సీజ్‌ చేయాలని,  ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని మృతిరాలి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం మృతిచేందిన గర్బిణి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గంజి నీళ్లతో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు చెక్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan - Mark Shankar: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment