YSR Rythu Bharosa: ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంక్ అకౌంట్‌లోకి ఎంత జమ అవుతుందంటే?

గత వారం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన ఏపీ వైసీపీ ప్రభుత్వం.. ఇవాళ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా(YSR Rythu Bharosa) నిధులను విడుదల చేస్తోంది. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఖాతా బదిలీ ద్వారా సాయం అందుతుంది. మొదటి విడతగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు అందిస్తోంది ప్రభుత్వం.

New Update
YSR Rythu Bharosa: ఇవాళ రైతుల ఖాతాల్లోకి డబ్బులు..  బ్యాంక్ అకౌంట్‌లోకి ఎంత జమ అవుతుందంటే?

Jagan to release YSR Rythu Bharosa Funds: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు రూ.109.74 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(సెప్టెంబర్ 1) విడుదల చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వరుసగా ఐదో ఏడాదీ అమలు చేస్తున్న ఈ పథకం కింద అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) భావిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులకు ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఖాతా బదిలీ ద్వారా సాయం అందుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 1,46,324 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇంకా, పలు పథకాల కింద మొత్తం రూ.31,005.04 కోట్లను రైతులకు అందజేసినట్లు వారు తెలిపారు.

రూ.7,500 జమ:
రైతుల కోసం వివిధ పథకాలను జాబితా చేస్తూ, ప్రభుత్వం రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద అక్టోబర్ 15, 2019 నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద, పీఎం కిసాన్ రూ.2,000తో సహా మొదటి విడత రూ.7,500 మేలో, రెండో విడత రూ.4,000 అక్టోబర్‌లో, మూడో విడత రూ.2,000 (పీఎం కిసాన్ మాత్రమే) జనవరిలో విడుదల చేస్తారు. అదేవిధంగా ఎండోమెంట్, అటవీ భూములు సాగుచేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలు, మైనార్టీ వర్గాల కౌలు రైతులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 అందజేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

Also Read: ఇడుపులపాయలో షర్మిల…నాన్న స్మృతిలో..!!

తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు:

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే రికార్డు స్థాయిలో పంట హక్కు సేద్యం ధ్రువీకరణ పత్రాలు (CCRC) జారీ చేసిందన్నారు. కౌలు రైతులతో పాటు ఎండోమెంట్ భూములు సాగుచేసే వారికి రైతు భరోసా కల్పించేందుకు వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Rythu Bharosa) సిద్ధంగా ఉందని వివరించారు. అర్హులైన సీసీఆర్‌సీల్లో 1,42,693 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలుదారులు, 3,631 మంది ఎండోమెంట్ భూముల సాగుదారులకు మొదటి విడతగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు అందజేస్తామని తెలిపారు.
సీఎం నేరుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కడం ద్వారా అర్హులైన రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తారని మంత్రి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమం అందించలేదని, ఏపీ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అలా చేశారన్నారు. నిజానికి ఈ కార్యక్రమం నిన్నే జరగాల్సి ఉండగా.. ఒక రోజు ఆలస్యంగా.. అంటే ఇవాళ్టికి వాయిదా పడింది. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని భూ యజమానులకు సంవత్సరానికి రూ. 13,500 సాయం అందిస్తోంది ప్రభుత్వం. దేశంలోనే కౌలు రైతులతోపాటూ.. దేవాదాయ, అటవీ భూముల్ని సాగు చేస్తున్న వారికి కూడా ఈ నిధులు ఇవ్వబోతున్న తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.

ALSO READ: చరిత్ర సృష్టించిన ఇస్రో… గాల్లోకి దూసుకెళ్లిన ఆదిత్య L -1..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు