Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా..

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖకు చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురవడంతో.. పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారాయన.

New Update
Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా..

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. అయితే, తనకు టికెట్ రానుందనే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్‌ను ఆశించారు. అయితే, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా పంపారు. కాగా, విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం ఆయన తన రాజీనామా లేఖను పంపలేదు.

తెలుగుదేశం పార్టీలో టాప్ లీడర్‌గా ఉన్న దాడి వీరభద్రరావు.. అనేక పదవులు చేపట్టారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా.. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ కు కేటాయించింది వైసీపీ. అయితే, అక్కడ అతను ఓటమిపాలయ్యాడు. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధపడుతుండగా.. పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో దాడివీరభద్రరరావు తీవ్ర అసంతృప్తికి లోనై.. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.

జనసేనలో చేరే ఛాన్స్..

వైసీపీని వీడిని దారి వీరభద్రరావు.. త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్‌ను కలిశారు వీరభద్రం. ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో.. ఆ పార్టీలో చేరిక దాదాపు కన్ఫామ్ అని అంటున్నారు వీరభద్రం అనుచరులు. ఇక పవన్ సైతం వీరభద్రం రాకను స్వాగతిస్తున్నారట. ఆయన వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్వసిస్తున్నారట జనసేనాని.

Also Read:

ఎంపీగా కేసీఆర్ పోటీ? హరీష్ రావు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

ఇక నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్.. దొరికారో బతుకు బస్టాండే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతిలో తలనీలాలు సమర్పించడం చర్చనీయాంశమైంది. మహిళలు తలనీలాలు సమర్పించవద్దని గరికపాటి గతంలో అన్న వీడియోను కొందరు షేర్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ మరో ప్రవచనకర్త వీడియోను వైరల్ చేస్తున్నారు.

New Update
Anna Lezhneva

Anna Lezhneva

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌ లో అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి తెలిసిందే.మార్క్‌ ఆ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. ఈ క్రమంలో మార్క్‌ ని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత రోజే..పవన్‌ సతీమణి అన్నా లెజోనావా తిరుమలకు వెళ్లారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

publive-image

అక్కడ ఆమె డిక్లరేషన్‌ ఫామ్‌ పై సంతకాలు చేసి..స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. మరుసటి రోజు స్వామి వారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా ఆమెనే అన్నప్రసాదాలను వడ్డించి,వారితోనే కలిసి కూర్చుని భోజనం చేశారు. అంతేకాకుండా మార్క్‌ పేరు మీద అన్న ప్రసాదాలకు విరాళాలు కూడా అందించారు.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

అన్నా భారతీయ స్త్రీ కాకపోయినప్పటికీ ఆమె స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించడం, సేవచేయడం వంటివి చేయడంతో జనసేన అభిమానులు,పవన్‌ అభిమానులు ఆవీడియోలను సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ చేస్తున్నారు. ఆమెకు భారతీయ సంస్కృతి మీద, దేవుని మీద ఉన్న భక్తిని కొనియాడుతున్నారు.

కానీ ఈ క్రమంలో తెరమీదకు మరో అంశం చర్చకు వచ్చింది.ఆమె తలానీలాలు సమర్పించడం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.

నిజమైన సనాతనంలో ఇది తగదంటున్నారు మరి కొందరు ఆధ్యాత్మిక వేత్తలు. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కి చెందిన ఓ వీడియోని వైరల్‌ చేస్తున్నారు. సనాతనం తెలిసిన హిందూ మహిళలు మూడు కత్తెరలు మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ముఖ్యంగా ముత్తయిదువులైన మహిళలు అస్సలు ఆ పని చేయకూడదంటున్నారు.

గుండు చేయించుకోవడం అశుభమంటున్నారు. మొక్కులు చెల్లించడం, జుట్టు ఇచ్చేయడం పరిపాటిగా మారిందని..దీనిని ఓవర్ యాక్షన్ అంటారంటున్నారు. పూర్వం ఎవరూ అలా చేయలేదని చెబుతున్నారు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడూ అలా చేయకూడదంటున్నారు. దీనికి లాజిక్ కావాలంటే సాధ్యం కాదని, కొన్ని యోగశాలలో రుజువైతే మరి కొన్ని యాగశాలలో నిరూపితమౌతాయని ఆ వీడియోలో ఉంది.

ఇదిలా ఉంటే...మరో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి అనంతలక్ష్మి మాటల వీడియో పోస్ట్ చేస్తున్నారు. మహిళలు తల నీలాలు సమర్పించడంలో తప్పు లేదంటున్నారు అనంతలక్ష్మి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Also Read: USA-China: అమెరికా, చైనా టారిఫ్‌ వార్‌లో బిగ్‌ట్విస్ట్‌.. ఒప్పందానికి రానున్న ఇరుదేశాలు !

ap | tirumala | Anna Lezhneva In Tirupat | Anna Lezhneva Offering Hair at Tirumal | Pawan Kalyan Wife Anna Lezhneva | Pawan Kalyan Wife Anna Lezhnava offerd Hair | latest-news

Advertisment
Advertisment
Advertisment