Anantapur Road Accident : చివరి శ్వాసలోనూ చేయి వదలని బంధం!

తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది.

New Update
Anantapur Road Accident : చివరి శ్వాసలోనూ చేయి వదలని బంధం!

Anantapur Road Accident: తాను విధులకు వెళ్తూ..భార్యను కూడా విధులకు పంపించాలనుకున్న ఆయన మీద ఆ వీధి చిన్న చూపు చూసింది. కొద్ది సేపట్లో చనిపోతానని తెలిసినప్పటికీ కుటుంబం గురించి పిల్లల గురించి ఆలోచించి ధైర్యంగా ఉండాలని భార్యకు చెప్పిన తీరు అక్కడ ఉన్న వారికి కంట తడి పెట్టించింది.

ఈ హృదయవిధారక ఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం తపోవనం సర్కిల్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదం త్వరాత తీవ్ర గాయాలతో ఉన్న దంపతులిద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్న దృశ్యాలు అందరికి కంటతడి పెట్టించింది. వివరాల ప్రకారం..ఏ ఆర్‌ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కిరణ్‌ తన భార్య అనిత ను బస్టాండ్‌ వద్ద దించేందుకు తీసుకుని వెళ్తుండగా తపోవనం సర్కిల్‌ వద్ద బండి జారిపోయి కిందపడిపోయారు.

పైకి లేచేలోపే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో కిరణ్‌ రెండు కాళ్లు పూర్తిగా ఛిద్రమైపోయాయి. తన ప్రాణాలు మరికాసేపట్లో పోతున్నాయని తెలిసినప్పటికీ ఆ బాధను అంతటిని కంటి బిగువున భరిస్తూ..పక్కన స్పృహ లేకుండా పడి ఉన్న భార్య వద్దకు పాకుతూ వెళ్లి తట్టి లేపాడు.

పిల్లలు జాగ్రత్త..అనిత!

నిస్తేజంగా పడి ఉన్న భార్యను చూస్తు గుండెలు విలసేలా రోదిస్తూ పిల్లల బాధ్యతను ఆమెకు అప్పగించాడు. ఆమెను గట్టిగా హత్తుకుని ఆమెలో ధైర్యాన్ని నూరిపోస్తూ మాటలు చెప్పాడు. ఈ ప్రమాదంలో అనితకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌ కు సమాచారం అందించనప్పటికీ అక్కడికి చేరుకోవడానికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. చికిత్స పొందుతూ కిరణ్‌ మృతి చెందగా, భార్య అనిత చికిత్స పొందుతున్నారు.

మంట గలసిన మానవత్వం!

ఈ ఘటన వల్ల మనుషుల్లో మానవత్వం నశించిపోయింది అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ప్రమాదం జరిగి దంపతులిద్దరూ రోడ్డు మీద పడి ఉంటే వారి వద్దకు ఎవరూ వెళ్లలేదు. కనీసం వారికి తాగడానికి కొంచెం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు సరికదా సెల్‌ ఫోన్లు తీసి చిత్రీకరిస్తున్నారు.

ఫోటోలు వీడియోలు తీసారే తప్ప ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంబులెన్సుకు ఫోన్ చేసి అక్కడే చూస్తూ నిలబడి ఉండిపోయారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చే వరకు వారికి కనీస సపర్యలు చేయకపోవడం మరీ దారుణం.

కిరణ్‌ స్వస్థలం ఆత్మకూరు. ఆయన ఏపీఎస్సీ కానిస్టేబుల్‌ గా ఎంపికై గ్రే హౌండ్స్ లో పని చేశారు. 2014 నుంచి జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు. భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పని చేస్తున్నారు. వారికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ కుమారులు ఉన్నారు.

ఇటీవలే నగరంలోని కల్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. కిరణ్ కుమార్ రోజూ భార్యను తన బండి మీద సోమలదొడ్డి క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవారు. ఈక్రమంలోనే బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mark’s Health Update : పవన్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే...?

సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

New Update
Mark’s Health Update

Mark’s Health Update

Mark’s Health Update : సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. మరో మూడు రోజులు మార్క్ శంకర్‌ను ఆస్పత్రిలో ఉంచనున్నట్లు తెలిసింది.

Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!


 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై పవన్ టీం హెల్త్ అప్‌డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మార్క్ శంకర్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌ చేరుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి మార్క్ శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపింది. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగచేరింది. మార్క్ శంకర్‌కు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు తీసుకువచ్చారని.. మరిన్ని పరీక్షలు చేయడంతో పాటుగా మూడురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలిపింది.

Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు