Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన

వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తాము ఈ నెల 23నే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. అయినా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు.

New Update
Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన

Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఈ సంఘటనపై ఈ రోజు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ఈ నెల 23న హెచ్చరించినట్లు చెప్పారు. అయినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సరైన సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని ఆరోపించారు. వయనాడ్‌ ఘటనపై రాజకీయం తగదని అన్నారు. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడూ రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. NDRF బృందాలు 24 గంటలుగా కష్టపడుతున్నాయని అన్నారు. ఇదిలా ఉంటే.. కేరళలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే 150 మందికి పైగా మృతి చెందారు. మరో 600 మందికి పైగా గల్లంతు అయ్యారు. ఇందుకు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read : వయనాడ్ విషాదం.. మొత్తం మృతులు 1000కి పైనే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

New Update
Andhra Pradesh Rajyasabha Election

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ సీటు కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కూటమి నుంచి ఈ సీటు కోసం ఎవరు బరిలో ఉంటారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ పోటీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

టీడీపీ ఓకే..

అయితే.. బీజేపీకి ఈ సీటును ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన సైతం అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీలో ఒకరిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. 

telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment