Drugs Case: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రకుల్ సోదరుడికి పాజిటివ్! డ్రగ్స్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ టెస్టులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తోపాటు మరో ఐదుగురికి పాజిటీవ్ వచ్చింది. దీంతో నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అమన్ ను A-14గా చేర్చారు. By srinivas 16 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ టెస్టులో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్కు పాజిటివ్ రావడంతో అతనితోపాటు ఐదుగురు నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. A - 1 అనూహ బ్లెస్సింగ్, నైజీరియన్, A - 2 అజీజ్ నోహిమ్, నైజీరియన్, A - 3 అల్లం సత్య వెంకట గౌతమ్, A - 4 సానబోయిన వరుణ్ కుమార్, బొమ్మిడివరం A - 5 మహబూబ్ షరీఫ్, అమన్ ను A-14గా చేర్చారు. ఇక అమన్తో పాటు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరికి నోటీసులు పంపించినట్లు డీసీపీ తెలిపారు. వారికి మరోసారి శాంపిల్స్ తీసుకుంటామని తెలిపారు. ఇక పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ అనే మహిళ 20 సార్లు హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఆమె రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వెల్లడించారు. ఆమెతో పాటు పోలీసులకు చిక్కిన గౌతమ్కు ఇటీవల 13.24 లక్షల కమీషన్ అందినట్లు గుర్తించారు. గడిచిన ఏడు నెలల్లో 2.6 కిలోల కొకైన్ సరఫరా చేసినట్లు అంచనా వేస్తుండగా.. ఇతను నైజీరియన్ మహిళ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాను వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అమన్ను అదుపులోకి తీసుకుని విచారించి పోలీసులు వదిలేశారు. #drugs-case #positive #amanpreet సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి