AP News: సూదులతో గుచ్చిన నిమ్మకాయలు.. అమలాపురంలో క్షుద్రపూజల కలకలం! అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్షుద్రపూజల కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని సుబ్రమనేశ్వరస్వామి గుడి సమీపంలోని ఓ బిల్డింగ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. By Vijaya Nimma 03 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో క్షుద్రపూజల కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని సుబ్రమనేశ్వరస్వామి గుడి వద్ద ఉన్న తంగెళ్ళ సత్యనారాయణ మూర్తి, మాణిక్యాలరావు సోదరుల బిల్డింగ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో సూదులతో గుచ్చిన నిమ్మకాయలు, ఎర్రరంగు నీళ్ళు, కుంకుమ చల్లి, కోడిగుడ్లని తాడుతో ఇంటికి కట్టి క్షుద్ర పూజలు చేసిన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఇద్దరు అర్చకులే ఇందుకు కారణమని సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న అమావాస్య కావటంతో చేతబడి చేశారని స్థానికులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజల వార్తలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. https://rtvlive.com/wp-content/uploads/2024/09/WhatsApp-Video-2024-09-03-at-3.21.03-PM.mp4"> #ap-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి