NATTIKUMAR: వైఎస్ వివేకాను ఎవరు చంపారో కూడా బయటపెట్టండి.. నట్టికుమార్ సవాల్

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు.

New Update
NATTIKUMAR: వైఎస్ వివేకాను ఎవరు చంపారో కూడా బయటపెట్టండి.. నట్టికుమార్ సవాల్

NATTIKUMAR: ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఆధారాలతో సహా అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది కదా.. మరి సీఎం చినాన్న వివేకాను ఎవరు చంపారో కనిపిఎట్టలేకపోయిన స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. జగన్, వైవీ సుబ్బారెడ్డి, రోజా, ది గ్రేట్ అంబటి రాంబాబు, సినిమా ఇండస్ట్రీ దేవుడు పోసాని కృష్ణమురళికి చిత్తశుద్ధి ఉంటే వివేకాను ఎవరు చంపారో బయటపెట్టండని ఛాలెంజ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్మరన్నారు. వివేకా హత్య కేసు నిందితులను పట్టుకున్నప్పుడే చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్ముతారని నట్టికుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను నట్టికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. దేవాలయం లాంటి శాసనసభలో మంత్రి కులాల ప్రస్తావన తీసుకురావడం, గొడవలకి వేదికగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక సినీ ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా చంద్రబాబు అరెస్టును నట్టికుమార్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరమని నట్టి వాపోయారు.

ఇది కూడా చదవండి: మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు గాయాలు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment