Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!

విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. 8వ తేది శివరాత్రి, 9వ తేదీ రెండో శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి.

New Update
Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.!

School Holidays for 3 Days: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త. పాఠశాలలకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రాబోతున్నాయి ఎప్పుడెప్పుడు సెలవులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు హాలిడేస్ వస్తున్నాయి.మార్చి 8వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇ తర్వాత రోజు అంటే మార్చి 9వ తేదీ రెండు శనివారం కావడంతో కొన్ని విద్యాసంస్థలకు ఆరోజు హాలీడే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆదివారం...ఎలాగో విద్యా సంస్థలు పనిచేయవన్న సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులకు వరుసగా మూడురోజులపాటు సెలవులు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రామేశ్వరం కేఫ్‌ బ్లాస్ట్‌.. క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్దరామయ్య

మార్చినెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవులు భారీగానే ఉండునున్నట్లు తెలుస్తోంది. ముందుగా మార్చి 3వ తేదీన ఆదివారం కావడంతో అందరికీ సెలవు. దీని తర్వాత వచ్చే శివరాత్రికి వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 17,24వ తేదీల్లో ఆదివారాలు వస్తున్నాయి. 25వ తేదీన హోలీ పండగ ఉంది. మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.ఇక మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడ్ ఉంది. ఆరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. మార్చి 31న ఆదివారం . ఇలా మార్చి నెలలో మొత్తం 11రోజులు సెలవులు వచ్చాయి. ఆరు ప్రభుత్వ సెలవులతోపాటు ఐదురోజులు ఆదివారాలు వచ్చాయి. బోర్డు పరీక్షలు కొనసాగుతున్నందున స్కూళ్లు సరిగ్గా పనిచేయడం లేదు.

ఇది కూడా చదవండి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

New Update
AP

Paster Praveen Case Briefing

మిస్టరీగా మారిన హైదరాబాద్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఎలా మృతి చెందారో పోలీసులు ఛేదించారు. అత్యాధునిక ఆధారాలు సేకరించడమే కాకుండా.. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్ మార్టం నివేదికలను సమగ్రంగా విశ్లేషించారు. దాని ప్రకారం మార్చి 24న రాజమండ్రికి దగ్గరలో కొంతమూరు దగ్గర పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో మృతి చెందారని నిర్ధించారు. ఈ విషయాన్ని ఏలూరు రేంజి ఐజీ అశోక్ కుమార్ వివరించారు.  

బైక్ మీద వెళ్ళడంతో యాక్సిడెంట్..

కేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ లో ఎస్పీ నరసింహ కిశోర్ తో కలిసి ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఉందని...తల, శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని..యాక్సిడెంట్ లో ఇవి తగిలి ఉండొచ్చని చెప్పారు. ఘటనాస్థలంలోనే పాస్టర్ ప్రవీణ్ చనిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి ఆయన 70 కి.మీ వేగంతో నాలుగో గేరులో వెళుతున్నట్టు ఆర్టీఏ అధికారులు చెప్పారని వివరించారు. ప్రవీణ్ మృతిలో అనుమానాలు రేకెత్తడంతో కుటుంబసభ్యులతో పాటూ 92 మంది సాక్షులను విచారించామని చెప్పారు. వారెవరికీ ఒకరితో ఒకరికి పరిచయాలు లేవని...ఆయన రాజమండ్రి వస్తున్నట్టు ప్రవీణ్ భార్య, ఇదే ఊరుకు చెందిన ఆకాశ్, అడపాక జాన్ కు మాత్రమే తెలుసునని తెలిపారు. కుటుంబ సభ్యులు సైతం మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ మకుమార్ చెప్పారు.    

అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ కావాలనే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద బయలుదేరారని పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఆయన కొద్ది రోజులు ఉండాల్సి వస్తుందని, పైగా ఆ వూర్లో అతనికి పనులు ఉండడం వలన బైక్ చేతిలో ఉంటే ఉపయోగపడుతుందని..హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చారని చెప్పారు. హైదరాబాద్ లో మిత్రుడు ఒకరు బైక్ మీద వెళ్ళొద్దని కూడా చెప్పారని అయినా ప్రవీణ్ వినలేదని అన్నారు. 

today-latest-news-in-telugu | paster praveen | accident | bike 

Also Read: AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

Advertisment
Advertisment
Advertisment