TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవల్సిందే..!!

తిరుమలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా?డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు పదిరోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. 10 కేంద్రాల్లో రోజుకు 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు విడుదల చేయనుంది.

New Update
TTD: తిరుపతి శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!

Alert To Devotees : తిరుమల(Tirumala) కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న భక్తులకు ముఖ్య గమనిక. మీరు తిరుమల వెళ్లాలనుకుంటే మాత్రం ముందుగా ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో చాలా మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ఆ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో మీరు కూడా వైకుంఠ ద్వార దర్శన సమయంలో తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ విషయాలును తెలుసుకోవాలి. తిరుమలలో ఎప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా తిరుమలకు ప్లాన్ చేసుకుంటే మంచిది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెలలో వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభం అవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు మొత్తం పదిరోజుపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. దీనికోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం కోసం తిరుపతి,తిరుమలలోని 10 కేంద్రాల్లో డిసెంబర్‌ 22 నుంచి 4.25 లక్షల టోకెన్లు ఇవ్వనున్నారు. రోజుకి 42,500 చొప్పున 10 రోజుల్లో 4.25 లక్షల టోకెన్లు రిలీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీరు తిరుమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లయితే మాత్రం ఈ టోకెన్లు తీసుకోవడం మంచిది. అలాగే మీరు తిరుమల వెళ్లే ముందు అక్కడి పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు తిరుమల వెళ్లే సమయంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందా ? లేదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉందా? వంటి విషయాలను కూడా తెలుసుకోవాలి.ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఇలా వర్షాలు పడితే..సమస్యలు తప్పవ. ఈ సమయంలో అక్కడ చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: యువ లాయర్లకు ఏపీ సీఎం గుడ్ న్యూస్..నేడు వారి అకౌంట్లోకి రూ. 30వేలు జమ..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

author-image
By Manogna alamuru
New Update
ap

Mark Shankar

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతనిని కొద్దిసేపటి క్రితమే ఇండియాకు తిరిగి తీసుకుని వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | deputy-cm-pawan-kalyan | pawan kalyan son mark shankar

Also Read: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment