UP Ex Cm Akhilesh Yadav: గోడ దూకిన అఖిలేష్‌ యాదవ్‌..ఎందుకంటే!

లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాశ్ నారాయణ్‌ ఇంటర్నేషనల్ సెంటర్‌ లోనికి వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్‌ తన అనుచరులతో కలిసి వచ్చారు. అయితే భవనం లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అఖిలేష్‌ యాదవ్‌ ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లారు.

New Update
UP Ex Cm Akhilesh Yadav: గోడ దూకిన అఖిలేష్‌ యాదవ్‌..ఎందుకంటే!

ఉత్తరప్రదేశ్‌ (Uttarapradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌(Akhilesh Yadav)  లక్నో(Lucknow)లో గోడలు దూకారు. ఇది ఏంటి అఖిలేష్‌ యాదవ్‌ గోడలు దూకడం అనుకుంటున్నారా..అయితే ఈ కథనం చదివేయండి. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాశ్ నారాయణ్‌ ఇంటర్నేషనల్ సెంటర్‌ లోనికి వెళ్లేందుకు అఖిలేష్ యాదవ్‌ తన అనుచరులతో కలిసి వచ్చారు.

అయితే భవనం లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. దాంతో లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అఖిలేష్‌ యాదవ్‌ ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లారు. ఆయన వెంట ఉన్న అనుచరులు కూడా ఇదే పద్దతిని అనుసరించారు. అందరు కూడా గోడ దూకి లోపలికి ప్రవేశించారు.

Also read: క్యాబ్‌ డ్రైవర్‌ తో గొడవ..200 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు!

ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన గురించి అఖిలేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ప్రారంభించిన అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేక పోరాటాన్ని బీజేపీ మళ్లీ మొదలు పెట్టేందుకు భయపడుతుందని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం బీజేపీ పాలనలో అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చాలా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో జయప్రకాష్ నారాయణ్ మాదిరిగా సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వాల్సి ఉందని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.

#akhilesh-yadav #ex-cm #up #lucknow
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూ...

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment