CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్‌ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?

ఏడాదికి రెండు సార్లు CBSE పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గుతుంది. స్కోర్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇక నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు జరగనుండగా.. వాటిలో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

New Update
CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్‌ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?

CBSE Board Exams To Be Held Twice A Year: CBSE బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనుండడం విద్యార్థులకు ప్రయోజనమేనంటున్నారు టీచర్లు. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) అప్‌డేట్ చేసిన కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంతో, ఇప్పుడు బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని కేంద్రం మొన్న (ఆగస్టు 22) ప్రకటించింది. దీనివల్ల విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి విద్యార్థులకు మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించనుంది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడానికి, పరీక్షలు సులభతరం చేసినట్టు కేంద్రం చెప్పుకుంటోంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది టర్మ్‌ వైస్‌ ఎగ్జామ్స్‌ కాదు.. రెండు పరీక్షల్లో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

కొత్త నిర్ణయాలేంటి?

➼ విద్యార్థులకు అత్యధిక స్కోర్‌ను నిలుపుకునే అవకాశాన్ని అందించడానికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడం.

➼ 11, 12వ తరగతులలో స్ట్రీమ్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని విద్యార్థులకు అందించడం.

➼ 11, 12వ తరగతిలో కనీసం ఒక భాష అయినా భారతీయ భాషను అభ్యసించాలి. రెండు లాంగ్వేజ్‌ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి

సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలపై ఓ లుక్కేయండి:

➼ విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.

➼ విద్యార్థులు తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి మరిన్ని అవకాశాలను పొందుతారు.

➼ ఏడాది పొడవునా చదువుపైనే దృష్టి పెట్టగలుగుతారు.

➼ ఇది మూల్యాంకన ప్రక్రియను మరింత సమగ్రంగా చేస్తుంది.

టీచర్లు విద్యార్థులు ఏం అంటున్నారు?
అటు టీచర్లు, విద్యార్థుల నుంచి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఏడాదికి ఒకసారి పరీక్ష పెట్టడం కంటే ఇలా రెండుసార్లు నిర్వించడం బెస్ట్ అని.. ఎప్పటికప్పుడు స్కూల్‌లో చెప్పే విషయాలపై పిల్లలు అప్‌డేట్‌గా ఉంటారంటున్నారు టీచర్లు. తమకు కూడా బర్డెన్‌ తగ్గుతుందన్నది విద్యార్థుల మాట. ఓకేసారి లాస్ట్‌లో పరీక్షకు ప్రిపేర్ అయ్యేకంటే నాలుగు నెలలకు ఒకసారి ప్రిపేర్ అవ్వడం వల్ల అంతకముందే జరిగిన క్లాసులను మరిచిపోయే అవకాశం లేదు. ఇక సిలబస్‌ కూడా రెండు పార్టలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. అంటే ఒకేసారి మొత్తం సిలబస్‌ చదవాల్సిన అవసరం లేదు. ఇది కచ్చితంగా ఒత్తిడిని తగ్గించే అంశం. ఒకేసారి 15 చాప్టర్లు గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP INTER RESULTS 2025: మరికొద్ది సేపట్లో ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్!

నేడు ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. వాట్సాప్‌లో 9552300009కు హాయ్‌ అని మెసేజ్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయని లోకేష్ తెలిపారు. వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో చెక్ చేసుకోవచ్చు.

New Update
nara lokesh minister

nara lokesh minister

ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ రోజు 11 గంటలకు ఇంటర్ పరీక్షలను విడుదల చేస్తారు. అయితే ఈ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. 9552300009కు హాయ్‌ అని ఎస్‌ఎంఎస్‌ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయి. ప్రతీసారి ఫలితాల కోసం హడావిడి ఏర్పాట్లు, ఖర్చులు లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

ఇది కూడా చూడండి: China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

Advertisment
Advertisment
Advertisment