Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్ బిగ్ బాస్ 8 ఎంట్రీ పై విష్ణుప్రియ స్పందించారు. గతంలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ షోకు వెళ్ళనని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం మాట మార్చింది. చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా నన్ను ఆషోలో చూస్తారని అన్నారు. By Anil Kumar 03 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Vishnu Priya : సోషల్ మీడియాలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ గురించి చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యాంకర్ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ గురించి విష్ణుప్రియ స్పందించారు. అప్పుడలా.. ఇప్పుడిలా కొంతకాలం క్రితం బిగ్ బాస్ షోకు కోట్లు ఆఫర్ చేసినా వెళ్ళనని విష్ణుప్రియ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు రూమర్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. " బిగ్బాస్కు వెళ్తే నేను పది కిలోల బరువు తగ్గుతానన్న నమ్మకముంది. నిజానికి నాకు బిగ్బాస్ షోకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఎందరో ప్రేక్షకుల దీవెనల వల్ల రియాలిటీ షోలో అడుగుపెడతానేమోనని భయమేస్తోంది. చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. Also Read : వయోనాడ్ బాధితుల కోసం కమల్ హాసన్ భారీ విరాళం..! వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా మీరు నన్ను బిగ్ బాస్ లో చూస్తారు" అంటూ విష్ణుప్రియ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్స్ విష్ణుప్రియ అప్పుడేమో అలా చెప్పి, ఇప్పుడు మాట మారుస్తుందని, ఆమెకు ఎలాంటి ఆఫర్స్ లేకపోవడంతో ఇలా మాట మార్చి బిగ్ బాస్ కు వెళ్లేందుకు రెడీ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి విష్ణుప్రియ బిగ్ బాస్ 8 తెలుగులో పాల్గొంటారా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. #vishnu-priya #bigg-boss-telugu-season-8 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి