Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో

'బింబిసారా' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. తాజాగా త్రిష ఈ మూవీ సెట్స్ లో చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. లెజెండ‌రీల‌తో కూడిన దివ్యమైన ఉద‌యం అని రాసుకొచ్చింది.

New Update
Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో

Vishwambhara: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. 'విశ్వంభర' లో మెగాస్టార్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read: RRR మూవీలో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్, కీరవాణితో త్రిష పోస్ట్

అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది త్రిష. సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. లెజెండ‌రీల‌తో కూడిన దివ్యమైన మార్నింగ్ అని రాసుకొచ్చింది.ఈ సినిమాలో త్రిష డబుల్ రోల్ నటిస్తున్నట్లు సమాచారం. అంతే కాదు రెండు పాత్రలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

publive-image

బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. 'విశ్వంభర' మూవీకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా .. చంద్రబోస్ లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. సుర్భి, హర్ష వర్ధన్, వెన్నెల కిషోర్, ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్, రావు రమేష్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు