Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే?

దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్‌ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్‌-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు.

New Update
Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే?

Actress Trisha : సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్టార్స్ సరసన జత కడుతూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో దూసుకుపోతున్న చెన్నై బ్యూటీ త్రిష.. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ స్పెషల్ సాంగ్ లో నటించిందట. అది కూడా తన అభిమాన హీరో కోసం కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ దళ పతి విజయ్ హీరోగా 'ది గోట్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష అతిధి పాత్రలో నటిస్తుందని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్‌ప్రభు వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు.

Also Read : సాయిధరమ్ తేజ్‌ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ వార్..

తమిళనాట విజయ్‌-త్రిష హిట్‌పెయిర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదు చిత్రాల్లో నటించారు. దాంతో హిట్‌ సెంటిమెంట్‌ను తన సినిమాకు వాడుకోవాలని డైరెక్టర్ వెంకట్ ప్రభు త్రిషతో స్పెషల్ సాంగ్ కు ఒప్పించినట్లు తెలుస్తోంది. త్రిష కూడా తన ఫేవరేట్ కో - స్టార్ సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. మరి 'గోట్' మూవీలో త్రిష స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment