Mrunal Thakur : ఆ సినిమా నిర్మాతలతో గొడవ పడ్డ మృణాల్ ఠాకూర్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన 'సీతారామం' బ్యూటీ!

మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని పంచుకుంది. 'పూజా మేరీ జాన్' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని, అందుకోసం నిర్మాతలతో సైతం గొడవ పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

New Update
Mrunal Thakur : ఆ సినిమా నిర్మాతలతో గొడవ పడ్డ మృణాల్ ఠాకూర్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన 'సీతారామం' బ్యూటీ!

Actress Mrunal Thakur : బాలీవుడ్, టాలీవుడ్‌లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సినిమాలో ప్రధాన పాత్ర పొందడానికి నిర్మాతలతో గొడవ పడాల్సి వచ్చిందని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'పూజా మేరీ జాన్' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని మృణాల్ తెలిపింది.

ఆడిషన్లు, స్క్రీన్ టెస్ట్స్ చేసిన తర్వాత కూడా ఆ పాత్ర మరో నటికి ఇవ్వబోతున్నారని తెలిసి నిర్మాతలతో గొడవ పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. " నేను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో ‘పూజా మేరీ జాన్‌’ ఒకటి. రెండేళ్ల క్రితమే చిత్రీకరించాం. బహుశా ఈ ఏడాది విడుదల కావొచ్చు. ‘సీతారామం’ షూట్‌ పూర్తైన వెంటనే ఈ సినిమా స్క్రీన్‌ టెస్ట్‌లో పాల్గొన్నా. ఇందులో పాత్ర నచ్చింది. ఇలాంటి రోల్‌లో ఎప్పటి నుంచో యాక్ట్‌ చేయాలనుకుంటున్నా.

Also Read : ఎన్టీఆర్ తో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ సినిమా తీస్తున్నాడా? అసలు నిజం ఇదే..!

నా నిజ జీవితానికి ఈ కథతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ కథ కోసం మరొక నటిని ఎంచుకుంటున్నారని తెలిసి.. నిర్మాతలతో గొడవ పడ్డా. ఈ రోల్‌ చేస్తానని చెప్పా. ఎన్నో ఆడిషన్స్‌ ఇచ్చా. స్క్రీన్‌ టెస్టుల్లో పాల్గొన్నా.ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలను ప్రాధేయపడి ఇందులో యాక్ట్‌ చేశా" అని తెలిపింది. కాగా రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు