Manchu Lakshmi : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.. షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన మంచు లక్ష్మి!

మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అప్పట్లో ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది. ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ లేదు. దాంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదని తెలిపింది.

New Update
Manchu Lakshmi : అప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు.. షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi Interview : ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగంలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి.. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు. మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్. నటిగానే గానే కాకుండా యాంకర్ గా, నిర్మాతగా కూడా రాణించింది.

టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ సెలెబ్రిటీస్ తో ఈమెకు మంచి బాండింగ్ ఉంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అప్పట్లో ముంబైలో తాను రామ్ చరణ్ (Ram Charan) ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది.

Also Read : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!

అందుకే రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా..

ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్ప లేదు. దీంతో వెళ్లిపోతానని చెప్పా. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు