Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిన 'దేవర' బ్యూటీ!

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైంది. తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫుడ్ పాయిజన్ వల్లే జాన్వీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

New Update
Janhvi Kapoor : జాన్వీ కపూర్ కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ లో చేరిన 'దేవర' బ్యూటీ!

Actress Janhvi Kapoor Admitted In Hospital : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైంది. తాజాగా ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ వల్లే జాన్వీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లు తెలిసింది. కల్తీ ఆహారం తినడంతో జాన్వీ కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనైందని.. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Also Read : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ‘సాహూ’ బ్యూటీ.. ఏం చెప్పిందంటే?

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని చెప్పారు. కాగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీతో సౌత్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. సినిమాలో 'తంగం' అనే పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో 'RC16' ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే ఛాన్స్ అందుకుంది. ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు