Love case: నన్ను అనుభవించి మోహం చాటేశాడు.. ప్రియుడికోసం యువతి మౌన పోరాటం! నాగరాజు అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని ఏపీలోని ముమ్మిడివరంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితోనే తనకు వివాహం చేయాలంటూ కాట్రేనికోన తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది. By srinivas 18 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి AP News: ఏపీలోని డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఓ యువతి ప్రేమించిన ప్రియుడికోసం మౌన పోరాటానికి దిగింది. నాగరాజు అనే యువకుడు కొంతకాలంగా తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని వాపోయింది. ఈ మేరకు కాట్రేనికోన మండల తహశీల్దారు కార్యాలయం ఎదుట దళిత యువతి రిలే నిరాహార దీక్ష చేపట్టింది. అతనికి మండలానికి చెందిన ప్రముఖ సీనియర్ విలేఖరి వత్తాసు పలికినట్లు బాధితురాలు తెలిపింది. ప్రేమించి పరారైన నాగరాజు, ప్రముఖ విలేఖరి అండతో దాగుడుమూతలాడుతున్నాడని ఆరోపించింది. తనను కులంపేరుతో దూషించి, నీ జాతికి ఇది మామూలే కదా, ఈరోజు ఒకడితో, రేపు మరొకడితో అంటూ ప్రముఖ సీనియర్ విలేఖరి హేళన చేసాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రియుడితో వివాహం జరపాలని, ప్రముఖ సీనియర్ విలేఖరిపై అత్యాచార నిరోధక, వేధింపుల చట్టం (sc,st atrocity) ప్రకారం కేసు నమోదుచేయాలని యువతి డిమాండ్ చేస్తోంది. #young-woman #nagaraju #love-failure సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి