షాద్ నగర్లో ఘోరం..పట్టపగలే యువతిపై కత్తితో దాడి.! రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘోరం జరిగింది. యువతిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో పరార్ అయ్యాడు. వెంటనే అప్రమత్తమైన తల్లి కూతురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. By Jyoshna Sappogula 18 Nov 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Crime News: మహిళలపై అత్యాచారాలు, దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. వారి రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి చట్టాలు తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఘోరం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ యువకుడు ఇంట్లో చొరబడి యువతిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అసలేం జరిగిందంటే..? Also read: తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.! షాద్ నగర్ కేశంపేట రోడ్డు రతన్ కాలనీలో పట్టపగలే ఓ యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. గాయత్రి అనే యువతిపై కత్తితో దాడి చేశాడు. మెడ, మణికట్టు వద్ద కత్తితో దారుణంగా దాడికి తెగబడ్డాడు. దీంతో, యువతి గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకుడు పరార్ అయ్యాడు. సమీపంలో ఉన్న తల్లి వెంటనే అప్రమత్తమైంది. కూతురి అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చింది. రక్తపు ముడుగులో కనిపించిన కూతురిని చూసి షాక్ అయింది. భయభ్రాంతులకు గురైన తల్లి వెంటనే కూతురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆ యువతి. Also Read: కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు మాత్రమే తెలుసు.! ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి తల్లి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు. యువతిపై దాడి చేసింది ఎవరూ? చేయాల్సిన అవసరం ఏంటి? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా, ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లికి చెందిన తిరుపతి అనే వ్యక్తి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిపై అతనే దాడికి పాల్పడి ఉంటాడని స్ధానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువతి షాద్ నగర్ పట్టణంలోని చైనా బాజార్ లో పని చేస్తుంది . #crime-news #rangareddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి