తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏకంగా తండ్రినే చంపేందుకు ప్లాన్ వేశాడు ఓ యువకుడు. కొంతకాలంగా ఖాళీగా ఉంటున్న 25 ఏళ్ల అమిత్‌.. నాన్న మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఆశపడ్డాడు. కిరాయి హంతకులతో రామ్‌జీపై కాల్పులు జరిపించిన ఈ భయంకరమైన ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

New Update
తండ్రి ఉద్యోగం కోసం తనయుడి దారుణం.. కిరాయి గుండాలతో కలిసి

తండ్రి ప్రభుత్వ ఉద్యోగం తాను దక్కించుకోవాలనే ఆశతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆయన మరణిస్తే ఆ జాబ్ తనకే వస్తుందని భావించి ఏకంగా కన్నవాడినే ఖతం చేయాలనుకున్నాడు.అవకాశం కోసం ఎదురుచూసి చివరికి అనుకున్నంత పనిచేశాడు. కొంతమంది కిరాయి హంతకులను పెట్టుకుని కాల్పులు జరిపించాడు. ఝార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ భయంకరమైన వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఈ మేరకు ఝార్ఖండ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌జీ అనే వ్యక్తి రామ్‌గఢ్‌లో కుటుంబంతో నివాసముంటున్నారు. అయితే కొంతకాలంగా సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్‌ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్‌ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని అమిత్‌ ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. ఆ పనికి కొంతమంది కిరాయి హంతకులను వినియోగించుకున్నాడు. ఈ క్రమంలోనే బయటకు వెళ్లిన రామ్‌జీపై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా షాకింగ్ నిజాలు బటయపడ్డాయి.

Also read : త్రిష రేప్‌ సీన్‌ ఇష్యూపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌.. ఏం చెప్పిందంటే

ఈ కేసులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా కుమారుడు అమిత్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. వెంటనే అమిత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. వీలైనంత త్వరగా వాళ్లను పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment