AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 21వ తేదీన తన స్నేహితులతో కలసి చల్లవారిగూడెం బంధువులకు ఇంటికి వెళ్లాడు. అయితే, అక్కడి నుండి మరో వ్యక్తితో అభినవ్ రాజమండ్రి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ అజ్ఞాత వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే యువకుడు మృతి చెంది ఉండడంతో వైద్యులు మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమారుడిను ముత్యాలు అనే వ్యక్తి హత్య చేశాడని తండ్రి సరిపాల్లి వెంకటేశ్వరావు, తల్లి అరుణ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…? #ap-crime-news #eluru-district #ap-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి