Watch Video: ఈ వీడియో చూస్తే రోడ్డుపై నడవాలంటే భయపడుతారు..!!

తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో  ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీ.సీ సజ్జనార్‌ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్..అమ్మో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Watch Video: ఈ వీడియో చూస్తే రోడ్డుపై నడవాలంటే భయపడుతారు..!!

Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో  ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.  అతివేగం..ఎప్పుడూ విషాదమే! అభంశుభం తెలియని పాదచారుల బతుకులను ఇలా చిద్రం చేస్తుంది. బాధిత కుటుంబాలకు మానసిక క్షోభను మిగుల్చుతుందని వీ.సీ సజ్జనార్‌ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ కారు డ్రైవర్ అతి వేగంగా దూసుకొచ్చాడు. తన ముందు ఉన్న కారుతో పాటు పక్కనే ఉన్న ఓ వ్యక్తిని సైతం ఢీ కొట్టాడు.  పెద్ద శబ్దం రావడంతో తిరిగి చూసింది అటు వైపు వెళ్తున్న యువతి. అయితే, ఆ కారు తన వైపు దూసుకొస్తుందని గ్రహించి పక్కకు జరిగేలోపు కారు తనను ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యువతి మృతి చెందింది. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలుసుకున్న పోలీసులు బాధిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ  కూతురు ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కూతురు మృతి చెందిందన్న వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తుంటారు..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందరపాటుతో..వారి కుటుంబాల్లోనే కాకుండా ఇతర కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపుతారు. అతి వేగానికి గమ్యం ఎప్పుడూ విషాదమే అవుతుందని చెబుతున్నా..డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహారిస్తుంటారు.

Also Read: 60 ఏళ్ల వృద్ధుడి అరాచకం..ఆపై భయపడి ఏం చేశాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు