AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్‌.. రియల్టర్‌తో రాసలీలలు!

విజయనగరం జిల్లాలో రియల్టర్ సతీష్‌, మహిళా కానిస్టేబుల్ రహస్య రాసలీలల బాగోతం బయటపడింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న సతీష్‌ రెండేళ్లుగా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తను వదిలేయాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది.

New Update
AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్‌.. రియల్టర్‌తో రాసలీలలు!

Vijayanagaram : ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకుని సంతోషంగా జీవిస్తున్న సంసారంలో ఓ మహిళా కానిస్టేబుల్ నిప్పులు పోసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estates Business) చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్న పురుషుడిపై కన్నేసి శృంగారం ఆశతో లొంగదీసుకుంది (Extramarital Affair). ఆ తర్వాత ఎంతగానో ప్రేమించిన భార్యకు అతన్ని నెమ్మదిగా దూరం చేసి రహస్యంగా కాపురం పెట్టింది. రెండేళ్లపాటు సాగుతున్న రహస్య రాసలీలల బాగోతం తాజాగా బయటపడగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నరకం చూపిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన..
ఈ మేరకు విజయనగరం జిల్లా (Vijayanagaram District) కు చెందిన రియల్ వ్యాపారి సతీష్‌.. మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రేమించిన భార్యను కాదని రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో వారిద్దరూ ఏకాంతంగా ఉండగా సతీష్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను ఆ ఇంటినుంచి బయటకు పంపాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే సతీష్‌ నరకం చూపిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రియల్టర్ సతీష్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని విచారించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Also Read : రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు