AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్‌.. రియల్టర్‌తో రాసలీలలు!

విజయనగరం జిల్లాలో రియల్టర్ సతీష్‌, మహిళా కానిస్టేబుల్ రహస్య రాసలీలల బాగోతం బయటపడింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న సతీష్‌ రెండేళ్లుగా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తను వదిలేయాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది.

New Update
AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్‌.. రియల్టర్‌తో రాసలీలలు!

Vijayanagaram : ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకుని సంతోషంగా జీవిస్తున్న సంసారంలో ఓ మహిళా కానిస్టేబుల్ నిప్పులు పోసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estates Business) చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్న పురుషుడిపై కన్నేసి శృంగారం ఆశతో లొంగదీసుకుంది (Extramarital Affair). ఆ తర్వాత ఎంతగానో ప్రేమించిన భార్యకు అతన్ని నెమ్మదిగా దూరం చేసి రహస్యంగా కాపురం పెట్టింది. రెండేళ్లపాటు సాగుతున్న రహస్య రాసలీలల బాగోతం తాజాగా బయటపడగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నరకం చూపిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన..
ఈ మేరకు విజయనగరం జిల్లా (Vijayanagaram District) కు చెందిన రియల్ వ్యాపారి సతీష్‌.. మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రేమించిన భార్యను కాదని రెండేళ్లుగా మహిళా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో వారిద్దరూ ఏకాంతంగా ఉండగా సతీష్ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన కాపురంలో నిప్పులు పోస్తుందంటూ మహిళా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను ఆ ఇంటినుంచి బయటకు పంపాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే సతీష్‌ నరకం చూపిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రియల్టర్ సతీష్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని విచారించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Also Read : రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ

గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది.

New Update
Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun: గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అయితే ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి నటులు ఏనాడు నేరుగా గొడవపడింది లేదు. ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో...హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 
 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు...రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్..డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
 
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల మీదా ఈ ప్రచారం ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. గతంలో సినిమా అభిమానుల మధ్య ఉన్న మంచివాతావరణం ఈమధ్య చెడిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment