పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!!

నేటి సమాజం ఎటు పయనిస్తుందో..గమ్యమెటో తెలియని పరిస్ధితి దాపురించింది. ఆధునిక కాలంలోనూ ఆటకవికంగా ప్రవర్తిస్తూ..మనషులనే విషయాన్ని మరిచిపోతున్నారు. అమాయక ప్రజలపై పలు చోట్ల ఇటీవల జరుగుతోన్న వరస దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న మధ్యప్రదేశ్ లో గిరిజనుడిపై మూత్రంపోసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ఏపీలోనూ ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆగ్రాలో అలాంటి ఘటనే మరోకటి జరిగింది. ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి..రక్తం కారుతుండా పైశాచికత్వంతో బాధితుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
పైశాచికత్వం...తలపై బాది.. మూత్రం పోసి.. మరో అమానవీయ ఘటన...!!

publive-image

ఆగ్రాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అతుస్ గ్రామంలో ఓ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో కొందరు దుండగులు ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న ఆ యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు.ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

వీడియో ఆధారంగా పోలీసులు ప్రధాన నిందితుడితో సహా ఇద్దరిని అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో, రక్తం కారుతున్న యువకుడు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పక్కనే కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు. ఒక యువకుడి ముఖం కనిపిస్తుంది. మరొకరి గొంతు వినబడుతుంది. దుర్భాషలాడుతూ ఆ గిరిజన యువకుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు.

బాధిత యువకుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సమీపంలో నిలబడి ఉన్న యువకులు అతన్ని గట్టిపట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో సికంద్రా ప్రాంతంలోని అటస్ గ్రామానికి సమీపంలో ఉందని డిసిపి సిటీ సూరజ్ కుమార్ రాయ్ తెలిపారు. దాడికి గురైన వ్యక్తి విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. వీడియోలో ఉన్న యువకుడిని ఆదిత్య ఇండోలియాగా గుర్తించారు.ఆదిత్య ఇండోలియా, అతని సహచరుడు భోలాను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను విచారించి మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువకుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన ముఠాపై ఇప్పటికే 11 కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. వీటిలో దోపిడీ, దొంగతనాల కేసులు ఉన్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment