Sabarimala : సరికొత్త రికార్డ్...రూ. 200కోట్లు దాటిన శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం..!!

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. కేవలం 39 రోజుల్లోనే రూ. 200కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 31లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చాని ఆలయ అధికారులు తెలిపారు.

New Update
Sabarimala :  సరికొత్త రికార్డ్...రూ. 200కోట్లు దాటిన శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం..!!

Ayyappa Temple : కేరళ(Kerala) లోని శబరిమల(Sabarimala) లో అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత కొన్న రోజులుగా శబరిమల అయ్యప్ప దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో అదుపు చేసేందుకు పోలీసులు, ఆలయ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది భక్తుల కారణంగా 39రోజుల శబరిమల ఆధాయం రూ. 200కోట్లు దాటింది. 39రోజుల క్రితం ప్రారంభం అయిన అయ్యప్ప దర్శనంలో భాగంగా ఇప్పటివరకు 31లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారని ఆలయ బోర్డు తెలిపింది.

మండలం విరక్కులో అయ్యప్ప(Ayyappa) దర్శనానికి వచ్చిన భక్తులతో శబరిమల ఆదాయం 200కోట్లు దాటిందని ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ట్రావన్ కోర్ దేవస్వామ్ బోర్డు(Travancore Devaswom Board) వెల్లడించింది. గత 39రోజుల్లో 204.30కోట్ల రూపాయలు, భక్తుల ద్వారా 63.89కోట్ల రూపాయలు, ఆవరణ ప్రసాదం ద్వారా ఆలయానికి 96.32కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. విరాళాల రూపంలో వచ్చిన ఆదాయం పూర్తి కాలేదని ట్రావన్ కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. నాణేల లెక్కింపు తర్వాత ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే అప్పం ప్రసాదం ద్వారా 12.38కోట్లు వచ్చినట్లు తెలిపారు.

డిసెంబర్ 25వరకు జరగిన ఈ మండల విరక్కు పూజలో 39రోజుల్లో 31,43,163 మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్దు తెలిపింది. ఆదివారం 1.12లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ఇప్పటివరకు 7,25,049 మందికి ఫ్రీగా ఆహారం అందించారు. మండల పూజ తర్వాత బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తామని టీడీబీ తెలిపింది. ఆ తర్వాత డిసెంబర్ 30 న మకరవిళక్కు ఉత్సవం కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 15న మకరజ్యోతి పూర్తయ్యే వరకు అక్కడి నుంచి ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు.

ఇక శబరిమలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యను పరిగణలోనికి తీసుకుని భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీబీకి ఆదేశాలు జారీ చేసింది. భక్తుల తొక్కిసలాటను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ డీజీపీని ఆదేశించింది.

ఇది కూడా చదవండి:  అలర్ట్…ఆధార్ లో కీలక మార్పులు…ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవల్సిందే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు