Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం

మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో 19మంది దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధిక వేగం, డ్రైవర్ అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం

Mexico City: మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో మంటలంటుకొని రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 19 మంది దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్రక్కు ను ఢీ కొట్టిన బస్సు..
ఈ మేరకు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ రాష్ట్రమైన జాలిస్కోలోని గ్వాడలజారా నగరం నుంచి సినాలోవాలోని లాస్ మోచిస్‌కు ప్రయాణిస్తున్న ప్రయాణీకుల బస్సు ఎలోటా పట్టణంలోని తీరప్రాంత నగరాలైన మజట్లాన్, లాస్ మోచిస్‌ను కలిపే రోడ్డులో ట్రక్కు ను వేగంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అవశేషాలను గుర్తించడానికి సమయం పడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రమాదకరమైన దృష్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా జనాలు ఉలిక్కిపడుతున్నారు.

ఇది కూడా చదవండి : Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త

అధిక వేగం..
ఇక మెక్సికోలో అధిక వేగం, పేలవమైన వాహన పరిస్థితులు లేదా డ్రైవర్ అలసట కారణంగా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయని అధికారులు అన్నారు. దేశంలోని హైవేలపై సరుకు రవాణా ట్రక్కుల ప్రమాదాలు కూడా పెరిగాయని, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఇదొకటని పేర్కొన్నారు. జులై 2023లో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో పర్వత రహదారిపై ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో కనీసం 29 మంది మరణించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

New Update
west bengal software dead

west bengal software dead

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా భయాందోళన మొదలైంది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 28 మంది పర్యాటకులను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్చి చంపారు. వీరిలో చాలా మంది మృతి చెందారు. కొత్త పెళ్లయిన వారిని కూడా దారుణం కాల్చి చంపేశారు. ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

భార్య, కుమారుడిని వదిలేసి..

వీరే కాకుండా మరో ఫ్యామిలీ కూడా ఈ ఉగ్రదాడికి బలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్‌లో పనిచేస్తున్న బితాన్ సొంతూరు అయిన పశ్చిమ బెంగాల్‌కి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో భార్య పిల్లలను వదిలేసి.. బితాన్‌ను చంపేశారు. భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అలాగే ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment