Jagtial : ప్రేయసిని చంపేందుకు వచ్చిన యువకుడిని కొట్టి చంపిన బంధువులు!

ప్రేమపేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అమ్మాయిపై దాడి చేసేందుకు ఇంటికొచ్చిన మహేశ్ ను ఆమె కుటుంబసభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరిగింది.

New Update
Jagtial : ప్రేయసిని చంపేందుకు వచ్చిన యువకుడిని కొట్టి చంపిన బంధువులు!

Crime : జగిత్యాల జిల్లా(Jagtial District) లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ(Love) వ్యవహారంలో ఓ యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి వచ్చిన యువకుడిని ఆమె కుటుంబసభ్యులు కొట్టి చంపారు. ఈ ఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో జరగగా స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

మూడేళ్లుగా వేధింపులు..
ఈ మేరకు మల్యాల సీఐ దామోదర్‌రెడ్డి(CI Damodar Reddy) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ మహేశ్‌ అనే యువకుడు మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్నాడు. సదరు యువతి మహేశ్‌(Mahesh) వేధింపులకు సంబంధించి అతని కుటుంబీకులకు చెప్పింది. మల్యాల పోలీస్‌స్టేషన్‌(Mallial Police Station) లో మార్చి 2న ఫిర్యాదు కూడా చేసింది. దీంతో మరింత రగిలిపోయిన మహేశ్.. ఎలాగైనా యువతిని దక్కించుకోవడమో లేక చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు మార్చి 6న ఆమె బర్త్ డే(Birthday) ను డెత్ డే(Death Day) గా మారుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే కత్తి పట్టుకుని యువతి ఇంటికి చేవచ్చి గొడపపెట్టుకున్నాడు. ఈ క్రమంలో యువతి కుటుంబీకులతో ఘర్షణ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన మహేశ్ యువతి తల్లి సత్తవ్వ, తాత నరసయ్యపై కత్తితో దాడి చేశాడు.

ఇది కూడా చదవండి : Accident: పెళ్లి ఇంట విషాదం.. కారు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం!

ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి..
అయితే తమను తాము కాపాడుకునే క్రమంలో యువతి కుటుంబీకులు మహేశ్‌ తలపై బండరాయితో కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. మహేశ్‌ దాడిలో తీవ్ర గాయాలకు గురైన ఇద్దరిని 108లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు మల్యాల సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్‌ఐ అబ్దుల్‌ రహీం తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు