Parliament Attack: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్‌ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?

లోక్‌సభలోకి ఆగంతకులు స్మోక్‌ స్టిక్స్‌ తీసుకెళ్లడంతో పార్లమెంట్‌ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పొగ పదార్థాలను పార్లమెంట్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సామాన్యులు.

New Update
Parliament Attack: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్‌ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?

కొత్త పార్లమెంట్‌ భవనం(New Parliament Building) నిర్మాణం మొదలైన దగ్గర నుంచి దాని ప్రారంభోత్సవం జరిగే వరకు కేంద్రం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. 'భవనానికి సంబంధించిన రాళ్లు అక్కడ నుంచి తీసుకొచ్చాం.. ఇక్కడ నుంచి మోసుకొచ్చాం.. ప్రపంచంలో మాదే బెస్ట్ పార్లమెంట్‌' అంటూ డబ్బా కొటుకున్న నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పార్లమెంట్‌ ఎన్ని వందల కోట్లతో నిర్మిస్తేనేం? సెక్యూరిటీ కదా ముఖ్యం. ఎంపీల భద్రతకే భరోసా లేకపోతే సామాన్యులు మాటేంటి? వాళ్లకి ఏం సమాధానం చెబుతారు.? ప్రజస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌ హౌస్‌పై దాడి జరగడమంటే యావత్‌ దేశంపై జరిగినట్టే కదా? సరిగ్గా 22ఏళ్ల క్రితం ఇదే జరిగింది కదా.. మరి ఆ లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? లోక్‌సభలోకి ఆగంతకులు దూసుకురావడం.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. షూ లో నుంచి పొగను బయటకు వదలడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు సెక్యూరిటీ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. నిందుతులపై.. పట్టుబడ్డ వారిపై బ్లేమ్‌ గేమ్‌ ఎలాగో ఉంటుంది కానీ.. సెక్యూరిటీ ఫెయిల్యూర్‌పై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది?
➡ పార్లమెంట్‌ హౌస్‌లోకి ఆగంతకులు వస్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తుంది?
➡ మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా గెస్ట్‌ పాస్‌ను ఆగంతకులు ఎలా తీసుకున్నారు?
➡ పొగ పదార్థాలను పార్లమెంటు లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు?
➡ ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా?
➡ ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యం ఇదేనా?

గ్రెనేడ్లను తీసుకువెళితే?
ఆగంతకులు లోపలికి కలర్‌ గ్యాస్‌(Color Gas)లను తీసుకెళ్లారని.. పెద్ద ప్రమాదమేమి కాదని చేతులు దులుపేసుకుంటే సరిపోదు కదా..? ఆ గ్యాస్‌ ప్లేస్‌లో గ్రెనేడ్లు ఉండి ఉంటే ఏం జరిగేది? వామ్మో తలుచుకుంటేనే భయం పుడుతుంది. ఇండియా వేసే ప్రతి అడుగును.. దేశంలో జరిగే ప్రతి పరిణామాన్ని యావత్‌ ప్రపంచం ఎంతో నిశీతంగా పరిశీలిస్తున్న వేళ లోక్‌సభలోకి దుండగులు దూసుకురావడంపై కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అందులోనూ కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇలా జరగడం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దాడి మన ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యంపైనా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. పార్లమెంటు విజిటర్స్‌ని కింద నుంచి మీద వరకు అణువణువు చెక్ చేసి కాని లోపలికి పంపరు. ఇన్నర్‌లో దాచుకుంటారేమోనని తొడల మధ్య తడిమి చూస్తారు కూడా. జేబులో పెన్ ఉన్నా తీసేస్తే గాని లోపలికి పంపరు. అలాంటిది ఇద్దరు స్మోక్ స్టిక్స్ పట్టుకుపోయారు అంటే లోపల వ్యక్తుల నుంచి సపోర్ట్ ఉందానన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చిన్నచిన్న ఆఫీస్‌ల్లోనే తెలియనివారిని లోపలకి పంపరు... అలాంటిది పార్లమెంట్‌లోకి స్మోక్ స్టిక్స్ ఎలా పట్టుకోచ్చారో?? ఎవరు అనుమతించారో తేలాల్సి ఉంది.

Also Read: అదరలేదు.. బెదరలేదు.. టీయర్‌ గ్యాస్‌ విసురుతుంటే రాహుల్‌ ఏం చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్

ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. ఈరోజు  ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయ్ విజయం సాధించింది. 

New Update
ipl

DC VS MI

ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. సూపర్ మ్యాచ్ లో ముంబయ్ విజయం సాధించింది. ఈరోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయ్ ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఎమ్ఐ 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ 206 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన డీసీ బ్యాటింగ్‌కు దిగిన  19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.

భారీ స్కోర్ ఇచ్చిన ముంబయ్..

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. మకేశ్ ఓ వికెట్ తీశారు. చివరి ఓవర్లో 11 రన్స్ చేశారు ముంబయ్ బ్యాటర్లు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(18) మరోసారి నిరాశపరిచాడు. ఐదో ఓవర్లో విప్రజ్‌ వేసిన చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో నమన్ దూకుడుగా ఆడి ముంబయ్ ఎక్కువ స్కోరు వచ్చలా చేశాడు. ఢిల్లీ  బౌలర్లలో విప్రజ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు.. ముకేశ్‌ ఒక వికెట్‌ తీశారు.    

today-latest-news-in-telugu | IPL 2025 | dc | delhi | mumbai-indians

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

Advertisment
Advertisment
Advertisment