Current Shock: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం!

బీహార్‌ లోని హరిహరనాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Bihar: బీహార్‌ లోని హాజీపూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుల్తానాపూర్‌ లోని హరిహరనాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 11,000 వోల్ట్‌ కరెంట్ లైన్‌ ట్రాలీ డీజే సిస్టమ్‌ కు తగలడంతో ఈ దారుణ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Husband: భార్యపై అనుమానంతో సుత్తితో కొట్టి చంపిన భర్త

నోయిడాలో భార్య మీద అనుమానంతో నూరుల్లా హైదర్ ఆమెను సుత్తితో కొట్టి చంపాడు. వారికి 2005లో పెళ్లి కాగా.. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉద్యోగం పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. భార్యకు ఆఫీస్‌లో వివాహేతర సంబంధం ఉందని హైదర్ అనుమానంతో ఈ పని చేశాడు.

New Update
man kill his wife

man kill his wife Photograph: (man kill his wife)

భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపేశాడు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నూరుల్లా హైదర్(55)కు 2005లో అస్మా ఖాన్‌తో వివాహమైంది. వీరికి బీటెక్ చదువుతున్న ఓ కుమారుడు, 8వ తరగతి చువుతున్న ఓ కుమార్తె ఉంది. నోయిడాలోని సెక్టార్ 15లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. భార్య అస్మా ఖాన్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.  ఆమె గతంలో ఢిల్లీలో నివసించింది. ఆమె భర్త జామియా మిలియా ఇస్లామియా నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్. ప్రస్తుతం అతను కూడా ఓ ప్రైవేట్ ఎంప్లాయి.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Also read: Fake doctor: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

అస్మాఖాన్‌ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని వారి కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment