Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్‌నగర్‌లో దారుణం జరిగింది. నీలందత్తు, లావణ్య దంపతుల ఐదు నెలల కొడుకు.. వాళ్లు పనిచేస్తున్న నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమ యజమానికి చెందిన కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది.

New Update
Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి

Dog Attack : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఐదు నెలల పసికందు(5 Months Old Baby) కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా(Mahabubnagar District) చిన్నచింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలందత్తు, లావణ్య దంపతులు బసవేశ్వర్‌నగర్‌లో నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం పనిలో చేరారు. ఆ పరిశ్రమ ప్రాంగణంలోనే వాళ్లకు కేటాయించిన గదిలో ఈ దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఐదు నెలల కొడుకు సాయినాథ్‌ ఉన్నాడు.

Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

మంగళవారం ఉదయం నీలందత్తు నాపరాయి కోత పని చేస్తున్నాడు. భార్యను మంచినీళ్లు అడగ్గా ఆమె బిడ్డను పడుకోబెట్టి భర్త వద్దకు వెళ్లింది. కొద్దిసేపటికే బాలుడి ఏడుపు వినిపించింది. వెంటనే లావణ్య వెళ్లి చూడగా.. యజమాని పెంపుడు కుక్క బాలుడిని కరుస్తూ కనిపించింది. తరిమేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడికి యత్నించింది. భార్య కేకలు విన్న నీలం దత్తు కుక్కను రాయితో కొట్టగా అది పారిపోయింది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దత్తు కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యజమాని కుటుంబ సభ్యులు వెంటనే ఆ కుక్కను కొట్టి చంపేశారు. దత్తు ఫిర్యాదు మేరకు నాగభూషణంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: శుభవార్త చెప్పిన ఐఎండీ..జూన్‌ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aamir Khan Mahabharata డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' అమీర్ భారీ ప్లానింగ్.. రూ.. 1000 కోట్లతో..!

అమీర్ ఖాన్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'మహాభారతాన్ని' వెండితెరపై చూపించాలనేది తన కల అని చెప్పారు. ఈ సంవత్సరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

New Update
Aamir Khan

Aamir Khan

Aamir Khan:  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'సితార్ జమీన్ పర్' సినిమాతో బిజీగా ఉన్నారు. తరచూ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కొత్త అప్డేట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత' పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలాకాలంగా అమీర్ ఖాన్ అతిగొప్ప ఇతిహాసమైన  'మహాభారతాన్ని' వెండితెర పై చూపించాలని ప్రయత్నిస్తున్నారు. 

'మహాభారతం' నా కల 

ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..  నేటి తరానికి మహాభరతాన్ని అందించాలనేది తన కల అని  చెప్పారు . ఈ ఏడాది దీనికి సంబంధించిన పనులను ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీని స్క్రిప్టింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుందని..  ఒకే సినిమాలో స్టోరీ అంతా చూపించలేమని అన్నారు. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' తరహాలో  సీరీస్ లుగా అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.  ఎంతోమంది డైరెక్టర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక చేస్తాము.  అమీర్ ఈ చిత్రంలో నటిస్తాడా లేదా? అని ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

1000 కోట్ల..

అమీర్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం 2018లో రాకేష్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమీర్ ఖాన్ దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో  'మహాభారతాన్ని' రూపొందించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే.. 2022లో 'లాల్ సింగ్ చద్దా' ఊహించని పరాజయంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమీర్.. ప్రస్తుతం ' సీతారే జమీన్ పర్' చేస్తున్నారు. 2007 లో వచ్చిన సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

latest-news | cinema-news | Aamir Khan Mahabharat

Also Read: Singer Sunitha: ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత సంచలన వీడియో.. అసలు నిజం ఇదే!

Advertisment
Advertisment
Advertisment