Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో పాటూ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల నీటి మట్టం పెరుగుతోంది. కాసేపట్లో ఇది 43 అడుగులకు చేరనుంది. మరోవైపు వరద నీరు రోడ్ల మీదకు రావడం వలన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

New Update
Bhadrachalam: 43 అడుగులకు చేరుకున్న భద్రాచలంలో గోదావరి నీటి మట్టం

Warning Sign At Bhdrachalam: ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద సుమారుగా నలభై మూడు అడుగులకు నీటి మట్టం చేరుకుంటోంది.దీంతో గేట్ల నుండి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. భద్రాచలం నుండి భారీగా పోలవరం కు చేరుకుంటున్న వరద నీరు పోలవరం వద్ద ఐదు లక్షల మూడు వేల క్యూసెక్కుల వరద నీరు ఇంట్లో గా ఉంది 48 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పోలవరం నుండి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకుంటున్న వరద నీరు నాలుగు లక్షల 175 గేట్లను తెరిచి సముద్రంలో వదులుతున్నారు.

ప్రధానంగా దిగువన శబరికి భారీ వరద వచ్చింది. ఛత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతుండటంతో గోదావరికి వరద పోటు మొదలైంది. రద నీరు కారణంగా భద్రాచలం స్నానఘట్టం మెట్ల వరకు నీరు వచ్చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం 8,38,117 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. చర్ల మండలం దగ్గర ఈత వాగుపై నుంచి వరద నీరు రావడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు, గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల దగ్గర నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగింది.

ఇక మరోవైపు భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 163వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. దీంతో ఈ జాతీయ రహదారిలో వాహనాల రాకపోలను అధికారులు నియంత్రించారు. వాహనాలు వెళ్కుండా ట్రాక్టర్లు, ట్రక్కులను అడ్డం పెట్టారు. పోలీసులు అక్కడే ఉండి అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. వరద పరిస్థిి చేయి దాటకుండా అధికారులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Also Read:Nature: అమ్మో ఆ కప్పలు చాలా డేంజర్…

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hrithik Roshan Krrish 4: ఇదో కొత్త ప్రపంచం, మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది: హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ తన డైరెక్షన్ డెబ్యూట్‌గా 'క్రిష్ 4'ను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడిగా మారడం తనకు కొత్తగా, సవాళ్లతో కూడినదిగా అనిపిస్తుందని చెప్పారు. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

New Update
Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

హృతిక్‌ త్రిపాత్రాభినయంలో..!

‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్‌లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment