Japan Earth Quake Updates: జపాన్ లో ఒక్కరోజులో 155 భూకంపాలు.. వేలాది ఇళ్లు ధ్వంసం..!!

జపాన్ ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటివరకు 8మంది మరణించినట్లు తెలిసింది. సోమవారం భారీ భూకంపం వచ్చిన తర్వాత మరో 50సార్లు భూమి కంపించింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు.

New Update
Japan Earth Quakes:జపాన్‌లో ఎందుకు ఎక్కువ భూకంపాలు వస్తాయి? కారణం ఇదే.

Japan Earth Quake Updates : సోమవారం (January 1) న్యూ ఇయర్ సందర్భంగా సెంట్రల్ జపాన్‌లోని పశ్చిమ తీరంలో ఇషికావా (Ishikawa) ప్రిఫెక్చర్‌లోని నోటో ద్వీపకల్పం సమీపంలో, ప్రజలు వేడుకల కంటే భయాందోళనలో మునిగిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 గంటలకు 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం (Earth Quake) సంభవించింది. భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టం కాగా, పలు ఇళ్లు కూలిపోయాయి. చాలా చోట్ల రోడ్లు తెగిపోగా, తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక (Tsunami warning)లు జారీ చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ శిథిలాల కింద ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకునే అవకాశం ఉంది. సునామీ హెచ్చరికలతో ఆ ప్రాంత వాసులను తమ ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరించారు. ప్రజలను సురక్షిత శిబిరాల్లో ఉంచుతున్నారు. జపాన్‌ (Japan)కు వెళ్లే పౌరులకు భారతదేశం కూడా ఒక సలహా జారీ చేసింది.

సోమవారం కొత్త సంవత్సరం సందర్భంగా జపాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి . 7 గంటల్లో 60కి పైగా భూకంపాలు (More than 60 earthquakes) భారీ విధ్వంసం సృష్టించాయి. అయితే, ఇంతకుముందు భారీ సునామీ హెచ్చరిక జారీ చేశారు.అయితే అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు. ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. ప్రస్తుతం, అనేక బృందాలు రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం నిమగ్నమై శిధిలాలను తొలగిస్తున్నారు. వర్షం, బలమైన గాలుల కారణంగా సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతోంది.

భూకంపం తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి:
జపాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, భూకంపం కారణంగా, నోటో ద్వీపకల్పంలోని నానోలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. హోన్షు ద్వీపంలోని తీర ప్రాంతమైన వాజిమా, ఇషికావా ప్రిఫెక్చర్‌లో ఆరుగురు వ్యక్తులు మరణించారు. భూకంపం తర్వాత నగరంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. బలమైన గాలులు, అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్వల్ప భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అక్కడి వాతావరణంశాఖ తెలిపింది.

ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకున్న అలలు:
భూకంపం కారణంగా, ఇషికావా ప్రిఫెక్చర్‌లో ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న సునామీ అలలు తీరాన్ని చేరుకున్నాయి. అలలు మొదట్లో 5 మీటర్లు (16 అడుగులు) వరకు చేరుకుంటాయని భావించారు కానీ దాని కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. 2011 సునామీ నోటో ప్రాంతంలో భారీ విధ్వంసం సృష్టించింది. 18,000 మంది మరణించారు. పొరుగున ఉన్న నీగాటా, టొయామా ప్రావిన్సులకు కూడా సునామీ హెచ్చరిక జారీ చేశారు. 51,000 మందిని వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సమీపంలోని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు.

జపాన్ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు.. జపాన్ ప్రజలను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే.. భూకంపం వస్తున్నా.. వారు ధైర్యంగా ఉన్నారని.. తమ ప్రాణాలను లెక్కచెయ్యకుండా వీడియోలు తీస్తున్నారని నెటిజన్లుకామెంట్స్ చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:  ఆల్కహాల్, సిగరేట్ తాగుతున్నారా? జరభద్రం…ఆ రిస్క్ తప్పదంటున్న వైద్యులు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment