TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్‌ స్టార్‌!

మయన్మార్‌ కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది.

New Update
TicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్‌టాక్‌ స్టార్‌!

TicTok Star: మయన్మార్‌ కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది. నీటి ప్రవాహం నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. రంగంలోకి దిగి అతి కష్టం మీద బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. తాళ్ల సాయంతో డెడ్‌ బాడీని పైకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇటీవల ముంబైకి చెందిన ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్‌దార్ కూడా మహారాష్ట్రలోని కుంభే జలపాతంలో పడి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ టూరిస్టు స్థలాలను పరిచయం చేస్తూ ఉండేది. తన స్నేహితులతో జలపాతాన్ని చూస్తూ.. కాలు జారి బండ సందుల్లో పడి ప్రాణాలు వదిలింది.

Also read: వయనాడ్‌ లో గల్లంతైన ఆ 600 మంది కార్మికులు ఎక్కడ..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ముగ్గురు పిల్లల తల్లి ఇంటర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో జరిగింది. శివాణికి గతంలో 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఏప్రిల్ 9న ఇంటర్మీడియేట్ స్టూడెంట్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వరుడు ఫ్యామిలీ కూడా ఒకే చెప్పింది.

New Update
UP inter student marriage

ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment