TS News: తెలంగాణలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు! క్రిస్మస్ సెలవుల కోసం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు చంపేసింది. రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన సుశాంత్ (13) సోమవారం ఉదయం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 26 Dec 2023 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు బలి తీసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం నిజామాబాద్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు ఇద్దరు కొడుకులు యశ్వంత్, సుశాంత్ (13) . సుశాంత్ ముస్తాబాద్ గురుకుల స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులు రావడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం ఒక్కసారిగా సుశాంత్ ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడ్ని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు. గుండెపోటు రావడంతోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నిన్నమొన్నటి వరకు ఇంట్లో అల్లారుముద్దగా తిరిగిన కొడుకు..అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోధనలు స్థానికుల కంటతడిపెట్టిస్తుంది. బాలుడు సుశాంత్ మృతి.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also read: పవన్ సీటు మార్చుకుంటే తప్పు లేదు కానీ.. మేము కో ఆర్డినేటర్లను మార్చితే తప్పా: మంత్రి సిదిరి ఫైర్ #rajanna-sirisilla #boy #heart-attack సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి