YS Sharmila: అమ్మ దీవెనలతో ప్రచారానికి బయలుదేరిన షర్మిల ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి వైఎస్ విజయమ్మ దగ్గర దీవెనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో షర్మిల ఓ పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు. Also Read: టీడీపీ, జనసేన కూటమిలో కుంపట్లు.. టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ..! మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నామన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో ప్రజల ఆశీస్సులు తనపై ఉంటాయని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని… pic.twitter.com/nWgwCpN1C6 — YS Sharmila (@realyssharmila) April 4, 2024 #ys-sharmila సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి