AP: బెంగుళూర్లో మాజీ సీఎం డిఫరెంట్ లుక్.. తొమ్మిది రోజుల తర్వాత.. మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి ఇవాళ తాడేపల్లికి రానున్నారు. ఇదిలా ఉంటే, జగన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు వైట్ షర్ట్ లో కనిపించే జగన్ తాజాగా వైట్ కుర్తాలో కనిపిస్తున్నారు. బెంగళూరులో అభిమానులతో దిగిన జగన్ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. By Jyoshna Sappogula 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YS Jagan: బెంగుళూర్లో మాజీ సీఎం జగన్ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు వైట్ షర్ట్ లో కనిపించే జగన్..తాజాగా, వైట్ కుర్తాలో మెరిశారు. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ అక్కడ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగారు. దీంతో జగన్ స్టైల్ మార్చారని సోషల్ మీడియా ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నాయి. ఇది చూసిన YCP శ్రేణులు గతంలో ఈ తరహా లుక్ లో జగన్ ను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. Also Read: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి ఇదిలా ఉంటే బెంగళూరు నుంచి ఇవాళ మాజీ సీఎం జగన్ తాడేపల్లికి రానున్నారు. మూడు గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు. తొమ్మిది రోజుల తర్వాత బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి రానున్నారు. గత నెల 22న పులివెందులకు వెళ్లిన జగన్.. 2 రోజుల పాటు పులివెందులలోనే కార్యకర్తలు, నేతలతో సమావేశం అయ్యారు. ఆ తరువాత జూన్ 24న బెంగళూరుకు వెళ్లారు. వారం రోజులపాటు బెంగళూరులోనే ఉన్నారు. Also Read: పుణెలో జికా వైరస్ కలకలం.. ఇద్దరు గర్భవతులకు పాజిటివ్! అయితే, తాడేపల్లిలోని జగన్ ఇంటి చుట్టూ చెకింగ్ గేట్స్ ను అధికారులు తొలగించారు. తాడేపల్లి రోడ్డును ఓపెన్ చేయడంతో జగన్ ఇంటి రోడ్డు వైపు సామాన్యులకు, వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. తాజాగా జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను నిలిపివేయకుండా కట్టడి చేసే టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను, చెక్పోస్టును అధికారులు తీసేశారు. #jagan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి