AP: అక్రమ ఇసుక దందా.. యువకుడు బలి..!

కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ప్రొద్దుటూరులో యదేచ్చగా ఇసుక అక్రమ దందా కొనసాగుతుండగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అర్ధరాత్రి ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడింది.

Also Read: ఖమ్మంలో అమానుషం.. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మపై మనవడు అఘాయిత్యం!

ఈ క్రమంలో ట్రాక్టర్ క్రింద పడి పెద్దయ్య అలియాస్ ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామానికి చెందిన పెద్దయ్య అలియాస్ ప్రతాప్ పొట్టకూటి కోసం ప్రొద్దుటూరుకు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. వైసీపీ, టీడీపీకి చెందిన మద్దతుదారులు సిండికేట్ అయ్యి ఇసుక అక్రమ రవాణా చేస్తోన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు