/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
trains
మరికొద్ది రోజుల్లో వేసవి సెలవుల ప్రారంభం కావడంతో... వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుండి తిరుమల వెళ్లే స్వామివారి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
Also Read:BIG BREAKING: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!
ఈ క్రమంలోనే తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. హైదరాబాద్ నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. వారి సౌకర్యార్థం.. దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసులు మే 23వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
Tirumala Special Trains
రైలు నెంబర్ 07017 చర్లపల్లి నుండి ప్రతి శుక్రవారం, ఆదివారం రాత్రి 10:35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెంబర్ 07018 తిరుపతి నుండి ప్రతి శనివారం , సోమవారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
చర్లపల్లి - తిరుపతి ఏప్రిల్ 11, 13, 18, 20, మే 4, 9 తేదీలలో రాత్రి 10:35 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి ఉదయం 10:10 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ సర్వీస్ ఏప్రిల్ 6వ తేదీన కూడా కల్పించారు. ఇక తిరుపతి - చర్లపల్లి ఏప్రిల్ 12, 14, 19, 21, 26, 28.. మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీలలో తిరుపతి నుండి సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరి ఉదయం 7:10 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికులకు ఏప్రిల్ 7వ తేదీన కల్పించారు. మొత్తం 32 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది.
ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపతి రోడ్, గదవాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!
Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
latest telugu news updates | latest-telugu-news | telugu-news | special-trains | south-central-railways | south-central-railway | secundrabad | tirupati | today-news-in-telugu | andhra-pradesh-news | latest telangana news
Balineni: రాజకీయాలను చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ .!
రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని. అందరూ కలిసి పని చేస్తానంటేనే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరో నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయనని తేల్చి చెప్పారు.
MLA Balineni Srinivasa Reddy : ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మండిపడ్డారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ, ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు చూడలేదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ. 50 లక్షలు పందెం పెట్టానని చెప్పారు. కానీ, తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని అన్నాడని.. దీంతో, మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే కచ్చితంగా ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి కూడా భావించారని అన్నారు. జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడని వ్యాఖ్యనించారు.
Also Read: అమ్మో..అమలాపురమా.. ట్రాఫిక్ కు దండం అంటున్న జిల్లా వాసులు.!
ఈ క్రమంలోనే పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీ చేస్తా తప్పా.. మరో నియోజకవర్గానికి వెళ్ళను అని తేల్చి చెప్పారు. అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అది కూడా ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్(Jagan) కి చెప్పానట్లు పేర్కొన్నారు. తాను నీతి మంతుడినని చెప్పడం లేదని.. కానీ, ఒంగోలు నియోజకవర్గంలో ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇస్తుంటే.. తీసుకోకుండా రాజకీయం చేయలేమన్నారు. ఒంగోలులో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు కనీసం ఓటర్ లిస్టును కూడా వెరిఫై చేయడం లేదని.. ఎందుకో తనకు అర్ధం కావడం లేదని బాలినేని వ్యాఖ్యనించారు.
South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!
హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan Son: పవన్ చిన్న కుమారుడిని సింగపూర్లో ఎందుకు చదివిస్తున్నాడో.. కారణం తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి సింగపూర్లో ప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం
ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
🔴Live News: మళ్లీ భారీ భూకంపం..
Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్
వైసీపీ నేత, కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు.రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!
Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్లో అల్లు అర్జున్- అట్లీ మూవీ (వీడియో చూశారా)
Kangana Sharma: ఎద అందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతున్న కంగనా శర్మ
Pawan Kalyan Son: పవన్ చిన్న కుమారుడిని సింగపూర్లో ఎందుకు చదివిస్తున్నాడో.. కారణం తెలుసా?
TG Crime: హైదరాబాద్లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !