Botsa Satyanarayana: వైసీపీకి 644 ఓట్లు.. ఎమ్మెల్సీగా గెలుపు నాదే.. బొత్స సంచలన కామెంట్స్

AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లాలోని వైసీపీకి 644 మందికి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని.. ఈ ఎన్నికలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.

New Update
Botsa Satyanarayana : డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై విచారణ జరపాలి: మాజీ మంత్రి బొత్స

Botsa Satyanarayana: మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మాట్లాడుతూ.. రానున్న శాసన మండలి ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు.

నర్సీపట్నం లో మాజీ శాసన సభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో వైసీపీకి 644 మంది కి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని, నర్సీపట్నం నియోజకవర్గంలో 88 మంది ఓటర్లు ఉండగా వైసీపీకి 64 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వైసీపీ గుర్తుపై గెలిచిన మీరంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తన విజయానికి కృషి చేయాలని కోరారు.

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల తరువాత జరగనున్న శాసనమండలి ఎన్నిక గొప్ప మలుపునకు నాంది కాబోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు, వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Also Read: వైసీపీ నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori First Wife: అఘోరీని ఉరి తియ్యండి.. వాడికి భయంకరమైన శక్తులు- మొదటి భార్య సంచలన నిజాలు!

అఘారీ మొదటి భార్య రాధిక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. అఘోరీకి ఉరిశిక్షే సరైన న్యాయమని తెలిపింది. ఆమెకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయని పేర్కొంది. తాను కూడా అఘోరీ ఏం చెప్తే అది వినేదాన్ని అని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

New Update

అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఎపీసోడ్ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ కోసం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ మరింత హైడ్రామా నడిచింది. అఘోరీ జండర్ తెలీకుండా జైల్లో ఉంచుకోమంటూ జైలు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అఘోరీ ట్రాన్స్‌జెండర్‌గా నిర్దారించి జైల్లో ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

పూర్తిగా జైల్లోకి వెళ్తేనే

ఈ నేపథ్యంలో అఘోరీ సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మొదటి మోసపోయింది మాత్రం నేనే అంటూ అఘోరీ ఫస్ట్ వైఫ్ రాధిక మీడియా ముందుకు వచ్చారు. తాజాగా రాధిక మరోసారి RTVతో మాట్లాడింది. ఇందులో భాగంగా అఘోరీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకుంది. అఘోరీ అరెస్ట్ అవడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపింది. కానీ ఇది కేవలం సగం మాత్రమేనని.. పూర్తిగా జైల్లోకి వెళ్లిన తర్వాతే తాను ఫుల్ హ్యాపీగా ఉంటానని తెలిపింది. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

పురుష బాధితులు

అఘోరీ దైవం అనే ముసుగులో వచ్చినపుడు దైవభక్తితోనే ఉండాలే తప్ప.. కూతురు, శిష్యురాలు అని చెప్పి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని తెలిపింది. అఘోరీ బాధితులు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆ లిస్టులో ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అఘోరీ ఒక ట్రాన్సజెండర్.. అతడు తన మాటలతో ఎవరినైనా మాయ చేసేస్తాడు. ఎలాంటి వారినైనా లొంగదీసుకుంటాడు. అఘోరీ మాయలో పడిన వారు బయటకు రావడం చాలా కష్టం అని ఆమె తెలిపారు. 

ఉరిశిక్ష పడాల్సిందే

ఆయన మాటలకు ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పుకొచ్చింది. ఇక అఘోరీకి కఠిన శిక్ష పడాలని.. అది కూడా ఉరిశిక్ష వేయాలని తెలిపింది. అదే అసలైన న్యాయం అని పేర్కొంది. అఘోరీకి వశీకరణ శక్తులు ఉండొచ్చని.. తాను కూడా అఘోరీ ఉన్నంత సేపు ఏం చెప్తే అదే వినేదాన్ని అని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

aghori Arrest | lady aghori arrest | lady aghori arrest news | lady aghori arrest updates | Radha Reaction On Aghori Arrest | latest-telugu-news | telugu-news | Aghori First Wife

Advertisment
Advertisment
Advertisment