Anil Kumar: నిన్నటి దాకా బాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా.. అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తనపై ఉండాలని అన్నారు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగనన్న గీత గీస్తే.. దాన్ని తాను దాటను అని అన్నారు. నిన్నటి దాకా చంద్రబాబును అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతా అని అన్నారు.

New Update
Anil Kumar: గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎమోషనల్

Anil Kumar Yadav: సీఎం జగన్ (CM Jagan) ఏది చెప్తే అదే నాకు శిరోధార్యం అని అన్నారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav). జగనన్న వల్లనే అనిల్ గా రాష్ట్రంలో దేశంలో ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. సీఎం జగన్ ఎక్కడకి వెళ్ళి పోటీ చేయమంటే అక్కడకు వెళ్తా అని స్పష్టం చేశారు. రెండు సార్లు ఎమ్మల్యేను చేశారు.. మంత్రిని చేశారు. నా గుర్తింపు జగన్ భిక్ష అని వ్యాఖ్యానించారు.

ALSO READ: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ

నరసరావుపేట నుంచి పోటీ చేస్తా..

జగన్ ఆదేశిస్తే నరసరావుపేట (Narasaraopeta).. మరెక్కడ నుంచైనా పోటీ చేస్తానని అన్నారు అనిల్ కుమార్. నెల్లూరీయులను ఇప్పటికే రెండు సార్లు పల్నాడు వాసులు గెలిపించారని పేర్కొన్నారు. జిల్లా చరిత్ర లో 75 ఏళ్ల తర్వాత నెల్లూరు లో ఒక బీసీ కి సీటు ఇచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇదే 75 ఏళ్ల తర్వాత పల్నాడు నరసరావుపేట లో ఒక బీసి కి అవకాశం ఇచ్చి మరో సారి చరిత్ర రాస్తున్నారని అన్నారు.

బాబు చరిత్ర పార్లమెంట్ లో వినిపిస్తా..

ఇప్పటి వరకు ఏపీలో బాబు (Chandrababu).. ఆయన కొడుకును తిట్టానని అన్నారు అనిల్. నరసరావుపేట ప్రజలు దీవిస్తే ఢిల్లీ లో ఏపీ గొంతుక వినిపిస్తా అని తెలిపారు. చంద్రబాబు చరిత్ర పార్లమెంట్ లో వినిపిస్తా అనిపేర్కొన్నారు. చంద్రబాబు దగ్గర ఉంటే సంసారం పక్కకు వెళ్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. జగనన్న సింహ గర్జన సిద్ధం తో ఎన్నికల శంఖారావం అని అన్నారు. స్వతంత్రం వచ్చాక ఎవరూ చేయని విధంగా సంస్కరణలను సీఎం జగన్ చేసారని అన్నారు.

ఏకైక నాయకుడు జగన్..

సంపన్నుల పక్కన బాబు, బక్కచిక్కిన వారి పక్కన జగన్ అని అన్నారు అనిల్. ఒక్క జగన్ ను ఢీ కొనేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర లో మంచి చేసి ఉంటే దీవించండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని కొనియాడారు. 2014, 2019 లో టికెట్ రాకున్నా పార్టీని నమ్ముకుని వుండడం వల్లే ఇవాళ మేరిగ మురళీధర్ గూడూరు ఎమ్మేల్యే అభ్యర్థి అయ్యాడని అన్నారు.

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.

New Update
Matsyakara sevalo scheme

Matsyakara sevalo scheme

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఒక్కో కుటుంబానికి రూ.20,000

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam

Advertisment
Advertisment
Advertisment