AP Politics: 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పు.. వైసీపీ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ మొదలైంది. సోమవారం పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, అదే రోజు సాయంత్రం 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది.

New Update
AP Politics: 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పు.. వైసీపీ సంచలన నిర్ణయం

New coordinators for YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ మొదలైంది. సోమవారం పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, అదే రోజు సాయంత్రం 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది. సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ప్రభావంతో వైసీపీ (YSRCP) అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సిట్టింగులను మార్చడం కూడా అధిష్టానం వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలుపే తమ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్పష్టంచేశారు. విజయావకాశాలను బట్టి నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను కూడా మార్చినట్లు ఆయన వెల్లడించారు.

అభ్యర్థుల జాబితా: 

మంగళగిరి - గంజి చిరంజీవి

చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు

గుంటూరు వెస్ట్ - విడదల రజిని

కొండేపి (ఎస్సీ) - ఆదిమూలపు సురేశ్

తాడికొండ (ఎస్సీ) - మేకతోటి సుచరిత

వేమూరు (ఎస్సీ) - వరికూటి అశోక్ బాబు

సంతనూతలపాడు (ఎస్సీ) - మేరుగు నాగార్జున

పత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్

అద్దంకి - పాణెం హనిమి రెడ్డి

రేపల్లె - ఈపూరి గణేశ్

గాజువాక - వరికూటి రామచంద్రరావు

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!

వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

New Update
Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets.

Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets

అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు చేసి.. వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అంటున్నారు. ఇటీవలే గుజరాత్‌లో అఘోరీతో ఉన్న వర్షిణీని ఆమె అన్నయ్యలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణీ ఫ్యామిలీని RTV ఛానెల్ సంప్రదించగా.. వారు అఘోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీకి డబ్బులు

ముఖ్యంగా అఘోరీకి డబ్బులు ఎలా వస్తున్నాయి?.. ఎంత వస్తున్నాయి?.. ఆమెకు ఆస్తులు ఉన్నాయా? లేదా? అనే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అఘోరీ తమకు చెప్పిందని వారు అన్నారు. ఈ మేరకు వర్షిణీ పేరెంట్స్ మాట్లాడుతూ.. తాను స్మశానంలో పూజలు చేస్తానని.. మినిమం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనని అఘోరీ చెప్పిందని అన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రభాస్ ఇంటి పక్కన విల్లా

ఆ పూజలు కేవలం బడా బడా వ్యక్తులకే చేస్తానని.. చిన్న చిన్న వారికి చేయనని అఘోరీ చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్‌లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉందని కూడా ఆమె చెప్పిందని.. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని కూడా అఘోరీ వారితో చెప్పినట్లు వర్షిణీ పేరెంట్స్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment