YCP: శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ అసంతృప్తి

శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా ఒకచోట చేరారు. వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చిచెబుతున్నారు.

New Update
YCP: శింగనమల నియోజకవర్గంలో కొనసాగుతున్న వైసీపీ అసంతృప్తి

YCP Shinganamala Constituency:  అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు అంతా ఒకచోట చేరారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

Also Read: ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు నిరసన సెగ.. ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు..!

మా సత్తా చూపిస్తాం..

వీరాంజనేయులుకు బీఫామ్ ఇవ్వలేదని.. వెంటనే ఆయన్ని మార్చడం అవసరమని అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివరెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలాలని తన బంధువులకు ఇచ్చి.. ఎనిమిది మంది పాలన సాగించారన్నారు. పార్టీని సర్వనాశనం చేశారని విమర్శలు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి చెప్పు చేతుల్లో ఉన్న వీరాంజనేయులుకు టికెట్ ఇస్తే పార్టీ బతికే పరిస్థితి లేదన్నారు.

Also Read: సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ

త్వరలోనే పదివేల మందితో భారీ సభ నిర్వహించి మా సత్తా ఏంటో అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఏడ ఎనిమిది సర్వేలు జరిగాయని అన్నింటిలోనూ శ్రావణి గెలుస్తుందని రిపోర్టు వచ్చినా.. అధిష్టానం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. పార్టీ బ్రతకాలంటే ఇక్కడ అభ్యర్థిని మార్చే తీరాలని వారు డిమాండ్ చేశారు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment