Andhra University : లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు..

తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఏయూ '' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కిశోర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.

New Update
Andhra University :  లక్ష్మీపార్వతి ఆ హోదా తొలగింపు..

Withdrawal The Status Of Telugu Academy Chairperson Of Lakshmi Parvathi : తెలుగు అకాడమీ (Telugu Academy) ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) కి గతంలో కేటాయించిన ఏయూ  (Andhra University)'' గౌరవ ఆచార్యురాలు'' హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కిశోర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని స్పష్టం చేశారు.

గతంలో ఆమె తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యత ఇచ్చారు.తాజాగా ఈ విధుల నుంచి కూడా తప్పించినట్లు పేర్కొన్నారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించామని తెలిపారు.

Also read: 300 కు చేరిన వయనాడ్ మృతుల సంఖ్య..మట్టిదిబ్బల కింద ఇంకెందరో..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment