హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు!

హిందువుల కోసం ప్రత్యేక దేశంగా 'కైలాస నాడు'ను ఏర్పాటు చేస్తున్నట్లు బోధకుడు నిత్యానంద ప్రకటించారు. ఆ దేశం ఎక్కడ ఉంటుందో జూలై 21న ప్రకటిస్తానని తన అధికారిక వెబ్‌సైట్‌లో సత్యానంద ఓ ప్రకటన విడుదల చేశాడు.

New Update
హిందువుల కోసం ప్రత్యేక దేశం..నిత్యానంద కీలక వ్యాఖ్యలు!

బోధకుడు నిత్యానందపై అనేక కేసులు ఉన్నాయి. 2019లో పోలీసులు వెతుకుతున్న క్రమంలో అతడు కనిపించకుండా పోయాడు. నిత్యానంద స్వయంగా కైలాస ద్వీపానికి వెళ్లినట్లు చెప్పారు. హిందువుల దేశంగా మార్చింది తానేనని చెప్పారు. దేశాధ్యక్షుడినని చెప్పుకుంటున్న నిత్యానంద..తమకు ప్రత్యేక ప్రభుత్వం,ప్రత్యేక జెండా, పాస్ పోర్టు, కరెన్సీ ఉన్నాయని ప్రకటించారు.
అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వీడియో ద్వారా ఉపన్యాసాలు ఇస్తూ తన అంకితమైన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. కైలాసాన్ని జులై 21న ప్రకటిస్తానని నిత్యానంద తెలిపారు. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేశాడు.

అందులో 'కైలాసం తెరుచుకుంది. 21న గురుపూర్ణిమ రోజున కైలాసం ఎక్కడ అనేది ప్రకటిస్తారు. మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము' అని అందులో పేర్కొన్నారు. అలాగే, 'కైలాష్ నివాసిగా ఇప్పుడే నమోదు చేసుకోండి' అని ఆన్‌లైన్ లింక్ ఉంది. ఈ ప్రకటనతో సమాధానం లేని కైలాస దేశం చిరునామా త్వరలో తేలనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు