Dal: ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే ఏం అవుతుందో తెలుసా..?

పప్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పప్పులు మానేస్తే జీవనశైలి, ఆరోగ్యంపై పూర్తి ప్రభావం చూపుతుంది. ఒక నెల రోజులు పప్పులు తినకపోతే శరీరంపై దాని ప్రభావం ఎలాంటి ప్రభావం చూపుతుందని పరిశోధన చేశారు. అది శరీరానికి ఏమౌతుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.

New Update
Dal: ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే ఏం అవుతుందో తెలుసా..?

Dal: భారతీయ ఆహారంలో పప్పులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నాన్‎వెజ్ తినని వారికి పప్పులు పౌష్టికాహారంలో ముఖ్యమైనవి. ముఖ్యంగా దక్షిణాసియాలో నివసించే ప్రజలు మధ్యాహ్న భోజనంలో పప్పులు, అన్నం తినడానికి ఇష్టపడతారు. పప్పులు తినకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? పప్పులు తినకపోవడం వల్ల కలిగే నష్టాలు, పప్పులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి.  కండరాలకు ఇది చాలా ముఖ్యమైనది. పప్పులు ముఖ్యంగా శాకాహారులకు ప్రోటీన్ మంచి మూలం. పప్పు పుష్కలంగా ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. కడుపులోని మైక్రోబయోమ్‌ను కూడా ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్లతో పాటు ఈ మినరల్స్ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్లు మొదలైనవి. ఒక నెల పప్పులు తినడం పూర్తిగా మానేస్తే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

నెల రోజులు పప్పులు తినకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది:

  • పప్పులో ఉండే కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెరస్థాయి అదుపులో ఉంటుంది.
  • రోజూ పప్పులు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • పప్పులో ఉండే ప్రొటీన్, పీచు కారణంగా పప్పులు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • పప్పులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు దృఢంగా ఉండేందుకు చాలా అవసరం.
  • నాన్‎వెజ్ తినని వారు ప్రొటీన్ల కోసం పప్పులపై ఆధారపడాల్సి వస్తుంది. పప్పులను పూర్తిగా వదిలేస్తే అది బలహీనత, కండరాల నొప్పి, తిమ్మిరికి కారణం కావచ్చు.
  • పీచుపదార్థాలు తక్కువగా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి.
  • పప్పులు తినకపోతే.. శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. దాని కారణంగా శరీరంలో విటమిన్లు లోపం, రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
  • పప్పులు తినడం ముఖ్యం ఎందుకంటే ఇది చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. పప్పులు మానేస్తే జీవనశైలి, ఆరోగ్యంపై పూర్తి ప్రభావం చూపుతుంది. శాకాహారులు, గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు తినడం ద్వారా శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో కొబ్బరి నీళ్లు తాగవచ్చా? తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment