Rain Alert: మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్..

వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరికాసేపట్లో విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు.

New Update
Rain Alert: మరో నాలుగు రోజులు వర్షాలే వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలర్ట్..

Andhra Pradesh Weather Forecast: వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరికాసేపట్లో విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు అధికారులు. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రానున్న 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సెప్టెంబర్ నెలలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం నామోదవుతుందని అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ విడుదల చేసిన రిపోర్ట్..

ఏపీలోని ఈ ప్రదేశాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

తెలంగాణకూ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్..

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ మొదటి, రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాగల మూడు రోజుల పాటు తెలంగాణాలోని ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను కూడా జారీ చేసింది హైదరాబాద్ ఐఎండీ. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.

రానున్న మూడు రోజుల పాటు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అలాగే పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

భారత వాతావరణ శాఖ వెడుదల చేసిన రిపోర్ట్..

స్కైమేట్ వాతావరణ నివేదిక..

publive-image

Also Read: Weather Forecast: హమ్మయ్య.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం..

ISRO Next Mission: ఆదిత్య ఎల్-1 సక్సెస్.. ఇస్రో నెక్ట్స్ టార్గెట్ అదేనా? ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ మీకోసం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment