Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.

New Update
Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!

Low Temperature in Telangana: తెలంగాణ చలి తీవ్రంగా గణనీయంగా పెరుగుతోంది. సూర్యుడు కనిపిస్తే ఒట్టు అన్నట్లుగా పరిస్థితి మారింది. డిసెంబర్‌ మొదటి వారం నుంచి తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడంలో చలికి జనం వణికిపోయారు. అందరూ తమ స్వెట్టర్లు తీస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే వేడి కోసం చలి మంటలు కాచుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు కూడా చలి రోజురోజుకు పెరుగుతోందని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత సాధారణ స్థితికి వస్తుందని చెప్పారు.

డిసెంబర్ నెలాఖరుకు మళ్లీ చలి తీవ్రత పెరిగి చలికి తోడు చలి గాలులు వీస్తాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తెలంగాణలోని మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతోంది. హైదరాబాద్ శివారులో అత్యల్పంగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 31 డిగ్రీలుగా నమోదైంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 12.5 డిగ్రీల సెల్సియస్‌, మెదక్‌లో 12.8, పటాన్‌చెరులో 13.2, ఆదిలాబాద్‌లో 13.7, హకీంపేటలో 14.5, హనుమకొండలో 15, దుండిగల్‌లో 15.7, రామగుండంలో 14.6, హైదరాబాద్‌లో 16.56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం 17, మహబూబ్ నగర్ 18.5, భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Also Read:

‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..

ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: 90 రోజులు టారీఫ్ లకు బ్రేక్..అంతా ఒట్టిదే..వైట్ హౌస్

ట్రంప్ టారీఫ్ ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు సుంకాలను ఆపేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని వైట్ హౌస్ కొట్టిపడేసింది. టారీఫ్ లను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 

New Update
us

White House

 ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. 

 

ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..

నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది.  ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్  మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.

 today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house

Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

Advertisment
Advertisment
Advertisment