Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్‌.. నీళ్లు లీక్!

అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేయగా.. మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలో 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

New Update
Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్‌.. నీళ్లు లీక్!

Annaram Barrage Leakage: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేశారు. అయినా కూడా నీళ్లు మరోసారి లీక్ అవుతున్నాయి. బ్యారేజ్ లో ప్రస్తుతం 2.5టీఎంసీల నీళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీళ్ళు లీక్ అవుతుండడంతో బ్యారేజ్ ను ఖాళీ చేసే పనిలో పడ్డారు అధికారులు. మొత్తం 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్ కి మరో వారంలో నేషనల్ డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించనుంది. అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ల భవితవ్యం తేల్చనున్న డ్యాం సేఫ్టీ అధికారులు.

ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment