Ananthapuram: అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్డెన్ ఆకృత్యాలు.!

అనంతపురంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో వార్డెన్ శివశంకర వర ప్రసాద్ ఆకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ గదిలో తన రూమ్ ను ఏకంగా బార్ గా మార్చేశాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ విద్యార్థులను చితకబాదుతున్నట్లు తెలుస్తోంది.

New Update
Ananthapuram: అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్డెన్ ఆకృత్యాలు.!

Ananthapuram: విద్యార్థులను క్రమ శిక్షణతో పెంచాల్సిన వార్డెన్ విచ్చలవిడిగా మధ్యం సేవిస్తూ విద్యార్థులను చితకబాదుతున్న ఘటన అనంతపురం నగర శివారులోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో చోటుచేసుకుంది. తాజాగా, వార్డెన్ శివశంకర వర ప్రసాద్ ఆకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ గదిలో తన రూమ్ ను ఏకంగా బార్ గా మార్చేశాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ అలాగే పొగాకు సంబంధించిన వాటిని సేవిస్తూ విద్యార్థులను చితకబాదుతున్న తెలుస్తోంది.

Also Read : కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ.

ఈ సంఘటనపై ఐదు, ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తూ తమ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాల వద్ద చేరుకుని ఆందోళనకు దిగారు. అక్కడ హాస్టల్ వార్డెన్ గదిని పరిశీలించగా పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, పొగాకు ఉత్పత్తులు సంబంధించిన ప్యాకెట్లు బయటపడ్డాయి. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ సంఘటనలకు సంబంధించి డీఈఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు.

Also Read: టీమిండియాకు భారీ షాక్‌.. విశాఖ టెస్టుకు స్టార్‌ ప్లేయర్ ఔట్!

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వార్డెన్ పై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ పై కేసు నమోదు చేయడమే కాకుండా పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు